ETV Bharat / state

వాలంటీర్ల మానవత్వం.. కరోనాతో చనిపోయిన వ్యక్తికి అంత్యక్రియలు!

author img

By

Published : May 4, 2021, 3:09 PM IST

ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా వచ్చిందంటేనే అందరూ భయపడిపోతున్నారు. ఇంకా ఆ వ్యక్తి మరణిస్తే.. అంతే సంగతి. చివరి చూపు చూడటానికి సైతం ఎవ్వరూ సాహించట్లేదు. అలాంటి పరిస్థితుల్లో కరోనాతో చనిపోయిన ఓ వ్యక్తి అంత్యక్రియలు నిర్వహించి మానవత్వాన్ని చాటుకున్నారు తూర్పుగోదావరి జిల్లాలోని గ్రామ వాలంటీర్లు.

funeral
అంత్యక్రియలు చేసిన వాలంటీర్లు

తూర్పు గోదావరి జిల్లా కొత్తపల్లి మండలం ఎండపల్లి గ్రామంలో కరోనా కారణంగా ఓ వ్యక్తి మృతి చెందాడు. అతడి కుటుంబ సభ్యులకు సైతం కరోనా ఉండటంతో అంత్యక్రియలు ప్రశ్నార్థకంగా మారాయి.

ఈ క్రమంలో అతనికి అంత్యక్రియలు నిర్వహించడానికి ఎవ్వరూ కూడా ముందుకు రాలేదు. చివరికి గ్రామ వాలంటీర్లు రవి, శివ కామేశ్వర్రావు, నాగేంద్ర, మరో వ్యక్తి బుజ్జి... ఆ మృతదేహానికి అంత్యక్రియలు పూర్తి చేశారు.

ఇదీ చదవండి:

తూర్పు గోదావరి జిల్లా కొత్తపల్లి మండలం ఎండపల్లి గ్రామంలో కరోనా కారణంగా ఓ వ్యక్తి మృతి చెందాడు. అతడి కుటుంబ సభ్యులకు సైతం కరోనా ఉండటంతో అంత్యక్రియలు ప్రశ్నార్థకంగా మారాయి.

ఈ క్రమంలో అతనికి అంత్యక్రియలు నిర్వహించడానికి ఎవ్వరూ కూడా ముందుకు రాలేదు. చివరికి గ్రామ వాలంటీర్లు రవి, శివ కామేశ్వర్రావు, నాగేంద్ర, మరో వ్యక్తి బుజ్జి... ఆ మృతదేహానికి అంత్యక్రియలు పూర్తి చేశారు.

ఇదీ చదవండి:

కొవిడ్​ నిబంధనలతో బోసిపోయిన యానాం తీరం

అమలాపురంలో కరోనాతో పది మంది మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.