ETV Bharat / state

గోదావరి వరదలో ఇద్దరు గల్లంతు

గోదావరి వరద ప్రవాహాన్ని చూడటానికి వెళ్లిన ఇద్దరు గల్లంతయ్యారు. మరొక వ్యక్తి ప్రవాహంలో పడిపోగా పక్కనే ఉన్న కానిస్టేబుల్ కాపాడాడు.

author img

By

Published : Aug 9, 2019, 7:06 PM IST

Updated : Aug 9, 2019, 11:41 PM IST

గోదావరి వరదలో ఇద్దరు గల్లంతు
గోదావరి వరదలో ఇద్దరు గల్లంతు

తూర్పుగోదావరి జిల్లా పాశర్లపూడి కరకట్ట దిగువ భాగం వరదలో ఇద్దరు గల్లంతయ్యారు. పాతపట్నానికి చెందినవారు గోదావరి వరద ప్రవాహన్ని చూడటానికి వెళ్లారు. అప్పనపల్లి- పాశర్లపూడి కట్టపై నడుస్తుండగా ప్రమాదం జరిగింది. ప్రవాహంలో మరొక వ్యక్తి పడిపోగా పక్కనే ఉన్న కానిస్టేబుల్ కాపాడాడు. ఇద్దరు యువకులు గల్లంతైన ప్రదేశాన్ని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి విశ్వరూప్‌, కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి, స్థానిక శాసనసభ్యుడు కొండేటి చిట్టిబాబు పరిశీలించారు. సహాయక చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలిచ్చారు.

గోదావరి వరదలో ఇద్దరు గల్లంతు

తూర్పుగోదావరి జిల్లా పాశర్లపూడి కరకట్ట దిగువ భాగం వరదలో ఇద్దరు గల్లంతయ్యారు. పాతపట్నానికి చెందినవారు గోదావరి వరద ప్రవాహన్ని చూడటానికి వెళ్లారు. అప్పనపల్లి- పాశర్లపూడి కట్టపై నడుస్తుండగా ప్రమాదం జరిగింది. ప్రవాహంలో మరొక వ్యక్తి పడిపోగా పక్కనే ఉన్న కానిస్టేబుల్ కాపాడాడు. ఇద్దరు యువకులు గల్లంతైన ప్రదేశాన్ని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి విశ్వరూప్‌, కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి, స్థానిక శాసనసభ్యుడు కొండేటి చిట్టిబాబు పరిశీలించారు. సహాయక చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలిచ్చారు.

ఇదీ చదవండి.

యానాంలో వరదను పరిశీలించిన కలెక్టర్

Intro:AP_GNT_23A_09_SRAVANA_SUKRAVARAM_PUJALU_AV_AP10169

యాంకర్.... తెలుగు లోగిళ్లు వరలక్ష్మి వ్రత శోభతో కళకళలాడుతున్నాయి. శ్రావణమాసం రెండో శుక్రవారం సందర్భంగా ఈ పూజ నిర్వహించటం మన సంప్రదాయం. తమ సౌభాగ్యాన్ని కాపాడాలని... కోరిన వరాలు ఇవ్వాలని వరలక్ష్మిదేవి రూపంలో ఉన్న అమ్మవారిని పూజించుటం వరలక్ష్మి వ్రతం ప్రత్యేకత. మారుతున్న కాలానికి అనుగుణంగా వరలక్ష్మి వ్రత విధానంలో కొత్త ఆకర్షణలు వచ్చి చేరుతున్నాయి. గతంలో కలశాన్ని అమ్మవారి రూపంగా భావించి పూజలు నిర్వహించేవారు. ఇటీవలి కాలంలో అమ్మవారి ముఖ ప్రతిమను ఆధారంగా చేసుకుని వరలక్ష్మిదేవి రూపాన్ని తయారు చేస్తున్నారు. ఇత్తడి బిందెలు, కలశాల సాయంతో అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేసి... నూతన వస్త్రాలతో అమ్మవారిని అలంకరించారు. కొబ్బరికాయకు వరలక్ష్మిదేవి ముఖాన్ని జోడించి... అమ్మవారి రూపును తమ ఇళ్లలో కొలువుదీర్చి భక్తితో మురిసిపోతున్నారు మహిళలు. అమ్మవారికి జెడఅల్లటంతో పాటు జెడకుచ్చులు తగిలించి... వడ్డాణాలతో సింగారించటంతో అమ్మవారి రూపానికి మరింత శోభ చేకూరుస్తున్నారు. నిండు ముత్తయిదువలా తయారైన వరలక్ష్మిదేవికి... స్వర్ణాభరణాలు జోడించి తన్మయత్వం చెందుతున్నారు. ఆ తర్వాత వరలక్ష్మి వ్రత కథను పఠించి... శాస్త్రోక్తంగా పూజాదికాలు నిర్వహిస్తున్నారు. ధూపదీప నైవేద్యాలు సమర్పించిన అనంతరం... తోటి ముత్తయిదువలకు పసుపు, కుంకుమ ఇచ్చి... వారి నుంచి ఆశీర్వాదాలు పొందుతున్నారు. తాంబూలంతో కూడిన వాయినం ఇవ్వటం ద్వారా వరలక్ష్మి వ్రతాన్ని పూర్తి చేస్తున్నారు. మహిళలు తమలోని సృజనకు పదును పెట్టడంతో వరలక్ష్మి వ్రత వైభవ మరింత ఇనుమడిస్తోంది.

Body:విజువల్స్...
Conclusion:
Last Updated : Aug 9, 2019, 11:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.