తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం నియోజకవర్గం నరేంద్రపురం గ్రామంలో.. చూడముచ్చటైన వింత ఇంది. ఇక్కడ.. మూడు దశాబ్దాల క్రితం రక్షిత మంచినీటి పథకంలో భాగంగా పంపుహౌస్ ను నిర్మించారు. కాలక్రమేణా ఇది శిథిలావస్థకు చేరింది. కానీ.. ఆ పంపు హౌజ్ పక్కనే.. ఓ మర్రి చెట్టు పెరిగి పెద్దదైంది.
పంపు హౌజ్ ను పూర్తిగా చుట్టేసి.. చెట్టులోపల ఉన్న ఇంటిగా మార్చేసింది. మొదటిసారి చూసినవాళ్లతై.. ఇది చెట్టులో ఇల్లా.. ఇంటిపై పెరిగిన చెట్టా.. అన్నది అర్థం కాక.. కాసేపు అలా తికమకపడతారు. తీక్షణగా గమనించిన తర్వాత కానీ.. అసలు విషయాన్ని, అందులోని వింతను వారు అర్థం చేసుకోలేరు. నరేంద్రపురం ప్రజలకు ఇది తెలిసిన విషయమే అయినా.. ఇక్కడికి వచ్చి వెళ్లేవారికి మాత్రం కచ్చితంగా వింతే మరి.
ఇదీ చదవండి: