ETV Bharat / state

పింఛన్ పేరుతో మాయ... ఒకేరోజు చోరీ!

వృద్ధురాలు ఒంటరిగా ఉంటుందని గ్రహించారు. అదను కోసం వేచి చూశారు. పింఛన్ సొమ్ము ఇవ్వటానికి వచ్చామని నమ్మించారు. మెడలో గొలుసు లాక్కెళ్లారు. మరోచోటా ఇదే రిపీట్ అయ్యింది. పింఛన్ సర్వేకు వచ్చామని నగలు దోచుకెళ్లారు. తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన ఈ ఘటనలు కలకలం రేపాయి.

author img

By

Published : Jun 5, 2019, 2:14 AM IST

పింఛన్ పేరుతో మాయ... గొలుసుల చోరీ

తూర్పు గోదావరి జిల్లాలో ఒకేరోజు జరిగిన రెండు ఘటనలు కలకలం రేపాయి. కొత్తపేట, రావులపాలెంలో చోరీలు స్థానికులను భయానికి గురిచేశాయి. వివరాల్లోకి వెళితే... రావులపాలెంలోని ఊబలంక రోడ్డులో పడాల మంగాయమ్మ అనే వృద్ధరాలు ఒంటరిగా జీవిస్తోంది. దీంతో ఆమె నగలు కాజేయాలని చోరులు ప్రణాళిక రచించారు. దీనికి పింఛన్ అధికారులమనే సాకుతో ఇంట్లోకి ప్రవేశించారు. ఆమె మెడలోని 5 కాసుల బంగారు గొలుసును చోరీ చేశారు. కొత్తపేట మండలం పలివెలలోనూ ఇదే పధకం రిపీట్ అయ్యింది. కొత్తగా పింఛన్ ఇవ్వటానికి వచ్చామని, వివరాలు సేకరించారు. ఫొటో తీయాలని చెప్పారు. మెడలో బంగారం ఉంటే పింఛన్ రాదని నమ్మబలికారు. ఆమె బంగారు తాడు తీసి పక్కన పెట్టిన వెంటనే... దాన్ని తీసుకుని ఉడాయించారు. సీఐ పెద్దిరాజు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

పింఛన్ పేరుతో మాయ... గొలుసుల చోరీ

ఇదీ చదవండీ: మహిళలే టార్గెట్.. హత్య, ఆపై అత్యాచారం

తూర్పు గోదావరి జిల్లాలో ఒకేరోజు జరిగిన రెండు ఘటనలు కలకలం రేపాయి. కొత్తపేట, రావులపాలెంలో చోరీలు స్థానికులను భయానికి గురిచేశాయి. వివరాల్లోకి వెళితే... రావులపాలెంలోని ఊబలంక రోడ్డులో పడాల మంగాయమ్మ అనే వృద్ధరాలు ఒంటరిగా జీవిస్తోంది. దీంతో ఆమె నగలు కాజేయాలని చోరులు ప్రణాళిక రచించారు. దీనికి పింఛన్ అధికారులమనే సాకుతో ఇంట్లోకి ప్రవేశించారు. ఆమె మెడలోని 5 కాసుల బంగారు గొలుసును చోరీ చేశారు. కొత్తపేట మండలం పలివెలలోనూ ఇదే పధకం రిపీట్ అయ్యింది. కొత్తగా పింఛన్ ఇవ్వటానికి వచ్చామని, వివరాలు సేకరించారు. ఫొటో తీయాలని చెప్పారు. మెడలో బంగారం ఉంటే పింఛన్ రాదని నమ్మబలికారు. ఆమె బంగారు తాడు తీసి పక్కన పెట్టిన వెంటనే... దాన్ని తీసుకుని ఉడాయించారు. సీఐ పెద్దిరాజు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

పింఛన్ పేరుతో మాయ... గొలుసుల చోరీ

ఇదీ చదవండీ: మహిళలే టార్గెట్.. హత్య, ఆపై అత్యాచారం

Kolkata, June 04 (ANI): Communist Party of India (Marxist) general secretary Sitaram Yechury admitted that the Left Front's vote base in West Bengal has shifted towards the Bharatiya Janata Party (BJP) in recent concluded Lok Sabha elections .He said, "People were traditionally voted for the left but in this polarization many have voted BJP to defeat All India Trinamool Congress (TMC)". While speaking to slogans fight between BJP and TMC, Yechury said that Ultimately it's not about 'Jai Shri Ram' or 'Jai Hind' the question is about protecting India as we know which the constitution defines as a secular democratic republic.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.