ETV Bharat / state

వాడపల్లి వెంకటేశ్వరాలయానికి పోటెత్తిన భక్తులు

author img

By

Published : Oct 25, 2020, 9:15 AM IST

రాష్ట్రంలోని వివిధ ఆలయాలకు భక్తుల తాకిడి పెరిగింది. ఏడు శనివారాల నోము కోసం తూర్పుగోదావరి జిల్లా వాడపల్లి వెంకటేశ్వరాలయం భక్తులతో పోటెత్తింది. నిన్న ఒక్క రోజే ఏడు వేల మంది స్వామిని దర్శించుకున్నారని ఆలయ ఈవో తెలిపారు.

vadapalli venkateswara swamy temple
భక్తులతో నిండిన వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం

కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన వాడపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయం భక్తులతో కిక్కిరిసింది. ఏడు శనివారాల నోము నోచుకోవడానికి తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురానికి భక్తులు పోటెత్తారు. స్వామి వారిని దర్శించుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి అధిక సంఖ్యలో తరలివచ్చారు. క్యూలైన్​లు అన్నీ నిండిపోయాయి.

కొవిడ్‌ నిబంధనలు అమలు చేస్తూ.. భక్తులకు స్వామి దర్శనాన్ని కల్పించామని ఆలయ ఈవో ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు. ఏడువేల మంది స్వామిని దర్శించుకోగా.. ప్రత్యేకదర్శనం, విరాళాలు ద్వారా 5 లక్షల రూపాయల ఆదాయం వచ్చినట్లు వెల్లడించారు.

కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన వాడపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయం భక్తులతో కిక్కిరిసింది. ఏడు శనివారాల నోము నోచుకోవడానికి తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురానికి భక్తులు పోటెత్తారు. స్వామి వారిని దర్శించుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి అధిక సంఖ్యలో తరలివచ్చారు. క్యూలైన్​లు అన్నీ నిండిపోయాయి.

కొవిడ్‌ నిబంధనలు అమలు చేస్తూ.. భక్తులకు స్వామి దర్శనాన్ని కల్పించామని ఆలయ ఈవో ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు. ఏడువేల మంది స్వామిని దర్శించుకోగా.. ప్రత్యేకదర్శనం, విరాళాలు ద్వారా 5 లక్షల రూపాయల ఆదాయం వచ్చినట్లు వెల్లడించారు.

ఇదీ చదవండి:

స్తబ్దుగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటు హక్కు దరఖాస్తులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.