రాచపల్లిలో రోడ్డుప్రమాదం, ఒకరు మృతి - road accident in east godavari dst one died and one injured
తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలం రాచపల్లి క్రాస్ రోడ్డు వద్ద ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. కిర్లంపూడి మండలం సింహాద్రిపురం గ్రామానికి చెందిన లక్ష్మణరావు, పెదకాపులు ద్విచక్ర వాహనంపై రాచపల్లి వెళ్లి వస్తుండగా రాచపల్లి అడ్డరోడ్డు వద్ద చెన్నై నుంచి వస్తున్న కారు ఢీకొట్టింది. దీంతో లక్ష్మణరావు అక్కడికక్కడే మృతిచెందారు. పెదకాపులుకు తీవ్రంగా గాయలయ్యాయి. అతని పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.