ETV Bharat / state

పుదుచ్చేరి సీఎంగా రంగస్వామి... యానాంలో అభిమానుల సంబరాలు

author img

By

Published : May 7, 2021, 6:24 PM IST

కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా ఎన్​ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు రంగస్వామి ప్రమాణ స్వీకారం చేశారు. యానాంలో అభిమానులు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు.

celebrations in yanam
యానాంలో సీఎం అభిమానుల సంబరాలు

కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా ఎన్​ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు రంగస్వామి బాధ్యతలు చేపట్టారు. ఆయన సీఎం పదవి చేపట్టటం ఇది నాలుగవసారి. ఈ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా సమీపంలోని యానాంలో ఆయన అభిమానులు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు.

పుదుచ్చేరి మాజీ ఆరోగ్య శాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు ఆధ్వర్యంలో పాత బస్టాండ్ వద్ద అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం అభిమానులు కేక్ కట్ చేశారు. కరోనా నిబంధనలు ఉండడంతో ఊరేగింపులు, ర్యాలీలకు ప్రభుత్వం అనుమతించలేదు.

కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా ఎన్​ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు రంగస్వామి బాధ్యతలు చేపట్టారు. ఆయన సీఎం పదవి చేపట్టటం ఇది నాలుగవసారి. ఈ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా సమీపంలోని యానాంలో ఆయన అభిమానులు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు.

పుదుచ్చేరి మాజీ ఆరోగ్య శాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు ఆధ్వర్యంలో పాత బస్టాండ్ వద్ద అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం అభిమానులు కేక్ కట్ చేశారు. కరోనా నిబంధనలు ఉండడంతో ఊరేగింపులు, ర్యాలీలకు ప్రభుత్వం అనుమతించలేదు.

ఇదీ చదవండి:

రైతుల్ని ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది: చినరాజప్ప

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.