తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం వద్ద గోదావరి మత్స్యకారులకు వేటాడుతున్న సమయంలో వలకు బంతి లాంటి ఆకారం ఉన్న చేప దొరికింది. దీనిని 'పఫర్ ఫిష్' అని పిలుస్తుంటారు. ప్రమాదం పొంచి ఉన్నప్పుడు ఇవి గాలి తీసుకుని బంతి ఆకారంలోకి మారిపోతాయి. ఈ చేపలు ఎంతో విషపూరితమైనవి. ఈ రకం చేపల్లో ఉండే విషం సైనేడ్ కంటే చాలా ప్రమాదకరమైనది. మత్స్యకారులు ఈ 'పఫర్ ఫిష్'ను కాసేపు తిలకించి మళ్లీ గోదావరిలోకి వదిలేశారు.
Pufferfish have been caught in the East Godavari district