ETV Bharat / state

11న.. అమరావతి రైతుల కోసం తెదేపా నిరసనలు

author img

By

Published : Oct 10, 2020, 10:08 PM IST

తూర్పు గోదావరి జిల్లాలో ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని ఆందోళన చేస్తున్న రైతులకు సంఘీభావంగా ఆదివారం తెదేపా నిరసన కార్యక్రమాలు చేపట్టనుంది. రాష్ట్ర ప్రభుత్వం రాజ్యంగ హక్కులను నాశనం చేస్తున్నందుకు నిరసనగా ఆదివారం ఉదయం అంబేడ్కర్ విగ్రహాల వద్ద జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేపట్టనున్నట్లు వెల్లడించింది.

Breaking News

ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని ఆందోళన చేస్తున్న రైతులకు సంఘీభావంగా తూర్పు గోదావరి జిల్లాలో తెదేపా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఈ మేరకు జేఏసీ జిల్లా కన్వీనర్ తాటిపాక మధు తెలిపారు.

నిరసనగా..

రాష్ట్ర ప్రభుత్వం రాజ్యంగ హక్కులను నాశనం చేస్తున్నందుకు నిరసనగా ఆదివారం ఉదయం అంబేడ్కర్ విగ్రహాల వద్ద ఆందోళన నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

మండల, సబ్ డివిజన్ కేంద్రాలు..

ఈ నెల 12న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలు, సబ్ డివిజన్ కేంద్రాలు, జిల్లా కేంద్రాల వద్ద నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వివరించారు. కార్యక్రమంలో తెదేపా మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, ఇతర పార్టీ నేతలు పాల్గొన్నారు.

ఇవీ చూడండి : శ్రీసిటీ.. ఇచ్చట అంతర్జాతీయ స్థాయి దుస్తులు తయారవును..!

ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని ఆందోళన చేస్తున్న రైతులకు సంఘీభావంగా తూర్పు గోదావరి జిల్లాలో తెదేపా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఈ మేరకు జేఏసీ జిల్లా కన్వీనర్ తాటిపాక మధు తెలిపారు.

నిరసనగా..

రాష్ట్ర ప్రభుత్వం రాజ్యంగ హక్కులను నాశనం చేస్తున్నందుకు నిరసనగా ఆదివారం ఉదయం అంబేడ్కర్ విగ్రహాల వద్ద ఆందోళన నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

మండల, సబ్ డివిజన్ కేంద్రాలు..

ఈ నెల 12న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలు, సబ్ డివిజన్ కేంద్రాలు, జిల్లా కేంద్రాల వద్ద నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వివరించారు. కార్యక్రమంలో తెదేపా మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, ఇతర పార్టీ నేతలు పాల్గొన్నారు.

ఇవీ చూడండి : శ్రీసిటీ.. ఇచ్చట అంతర్జాతీయ స్థాయి దుస్తులు తయారవును..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.