తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి మండలం గుజ్జుమామిది వలస కూడలి వద్ద... 240 కిలోల గంజాయి బస్తాలను, రూ.28వేల 900 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ.4.40లక్షల ఉంటుందని ఏఎస్పీ జిందాల్ తెలిపారు. గంజాయిని విశాఖ జిల్లా దారకొండ నుంచి దిల్లీకి తరలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
ఇవీ చదవండి....టన్నుల కొద్ది గంజాయి... ఎలా తరలిస్తున్నారో తెలుసా..?