అప్పుడే పుట్టిన బిడ్డను ఎత్తుకుని ఆసుపత్రి నుంచి నడిచి వెళ్తున్న బాలింతకు పోలీసులు అండగా నిలిచారు. తూర్పు గోదావరి జిల్లా తునిలో ఓ మహిళ ఆసుపత్రిలో ప్రసవించింది. అనంతరం లాక్ డౌన్ కారణంగా వాహనాలు లేక నడిచి ఇంటికి వెళుతుండగా పోలీసులు గమనించారు. ఆమెకు సాయం చేశారు. అక్కడే విధులు నిర్వర్తిస్తున్న సీఐ రమేశ్ బాబు తన జీపును సిబ్బందికి ఇచ్చి ఆమెను ఇంటివద్ద దింపేలా చేశారు. వారి సహాయానికి ఆమె కృతజ్ఞతలు తెలిపింది.
ఇవీ చదవండి: