ETV Bharat / state

కరోనాతో వ్యక్తి మృతి.. ఇంటి ముందే పడి ఉన్న మృతదేహం - వానపల్లిలో కరోనాతో వ్యక్తి మృతి

కరోనా.. ఈ పేరు వింటేనే జనం భయపడిపోతున్నారు. ఎప్పుడు ఎవరికి సోకుతుందో.. ఎలా బలితీసుకుంటుందో తెలియక బిక్కుబిక్కుమంటూ బతుకీడుస్తున్నారు. మరీ ముఖ్యంగా బంధాలను దూరంచేస్తోంది. మానవత్వం అనే మాటను మరిచిపోయేలా చేస్తోందీ మహమ్మారి. వైరస్​తో చనిపోతే అయినవాళ్లే మొహం చాటేసేలా చేస్తోంది. ఓ వ్యక్తి కొవిడ్​తో చనిపోతే ఒక రాత్రంతా అనాథ శవంలా గుమ్మం ముందే ఉన్న ఘటన తూర్పుగోదావరి జిల్లా వానపల్లిలో జరిగింది.

person died with corona last rituals not done in vaanapalli east godavari
కరోనాతో వ్యక్తి మృతి
author img

By

Published : Aug 1, 2020, 9:34 AM IST

తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మండలం వానపల్లికి చెందిన 40 ఏళ్ల వ్యక్తికి కరోనా సోకింది. అప్పటినుంచి హోం ఐసోలేషన్​లో ఉంటున్నాడు. శుక్రవారం రాత్రి ఊపిరి అందక బాధపడటంతో స్థానికులు 108కు ఫోన్ చేశారు. వారు వచ్చేసరికే అతను మృతిచెందాడు. అతని భార్యకూ వైరస్ సోకటంతో ఆమె బోడనకుర్రు క్వారంటైన్​లో ఉంటోంది. ఆ వ్యక్తికి అంత్యక్రియలు చేసేందుకూ ఎవరూ ముందుకు రాకపోవటంతో అతని మృతదేహం ఇంటి ముందే ఉంది.

ఇవీ చదవండి..

తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మండలం వానపల్లికి చెందిన 40 ఏళ్ల వ్యక్తికి కరోనా సోకింది. అప్పటినుంచి హోం ఐసోలేషన్​లో ఉంటున్నాడు. శుక్రవారం రాత్రి ఊపిరి అందక బాధపడటంతో స్థానికులు 108కు ఫోన్ చేశారు. వారు వచ్చేసరికే అతను మృతిచెందాడు. అతని భార్యకూ వైరస్ సోకటంతో ఆమె బోడనకుర్రు క్వారంటైన్​లో ఉంటోంది. ఆ వ్యక్తికి అంత్యక్రియలు చేసేందుకూ ఎవరూ ముందుకు రాకపోవటంతో అతని మృతదేహం ఇంటి ముందే ఉంది.

ఇవీ చదవండి..

ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం.. వార్డులోనే కరోనా బాధితురాలి మృతదేహం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.