ETV Bharat / state

జగ్గంపేటలో క్వారంటైన్​ కేంద్రం ఏర్పాటుపై ప్రజల ఆందోళన - people protest against quarantine centers news

తమ కాలనీలో క్వారంటైన్​ కేంద్రం ఏర్పాటు చేయడంపై తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరం యానాది కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేశారు. క్వారంటైన్​ కేంద్రం తరలించాలని డిమాండ్​ చేస్తూ.. ధర్నాకు దిగారు.

జగ్గంపేటలో క్వారంటైన్​ కేంద్ర ఏర్పాటుపై ప్రజల ఆందోళన
జగ్గంపేటలో క్వారంటైన్​ కేంద్ర ఏర్పాటుపై ప్రజల ఆందోళన
author img

By

Published : Apr 30, 2020, 4:42 PM IST

Updated : Apr 30, 2020, 4:49 PM IST

తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరం యానాది కాలనీలో జనావాసాల మధ్య క్వారంటైన్ కేంద్రం ఏర్పాటు చేయడంపై అక్కడి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం లేచి చూసే సరికి బీసీహాస్టల్​లో క్వారంటైన్​ సెంటర్​ ఏర్పాటై ఉందని.. దీనిపై అంతా ఆందోళనకు గురయ్యారని గ్రామ మాజీ ఉపసర్పంచ్​ అడబాల వెంకటేశ్వరరావు అన్నారు. క్వారంటైన్​లో ఉన్నవారు బయట తిరుగుతున్నారని.. దీని వల్ల ఇక్కడి వారు భయానికి గురవుతున్నారని పేర్కొన్నారు. ఈ క్రమంలో కాలనీవాసులు బీసీ హాస్టల్​ వద్ద ధర్నాకు దిగారు. క్వారంటైన్​ కేంద్రాన్ని వెంటనే ఇక్కడి నుంచి తరలించాలని డిమాండ్​ చేశారు.

ఇదీ చూడండి..

తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరం యానాది కాలనీలో జనావాసాల మధ్య క్వారంటైన్ కేంద్రం ఏర్పాటు చేయడంపై అక్కడి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం లేచి చూసే సరికి బీసీహాస్టల్​లో క్వారంటైన్​ సెంటర్​ ఏర్పాటై ఉందని.. దీనిపై అంతా ఆందోళనకు గురయ్యారని గ్రామ మాజీ ఉపసర్పంచ్​ అడబాల వెంకటేశ్వరరావు అన్నారు. క్వారంటైన్​లో ఉన్నవారు బయట తిరుగుతున్నారని.. దీని వల్ల ఇక్కడి వారు భయానికి గురవుతున్నారని పేర్కొన్నారు. ఈ క్రమంలో కాలనీవాసులు బీసీ హాస్టల్​ వద్ద ధర్నాకు దిగారు. క్వారంటైన్​ కేంద్రాన్ని వెంటనే ఇక్కడి నుంచి తరలించాలని డిమాండ్​ చేశారు.

ఇదీ చూడండి..

కంటైన్మెంట్ జోన్‌లో కూరగాయలు పంపిణీ చేసిన ఎంపీ

Last Updated : Apr 30, 2020, 4:49 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.