ETV Bharat / state

'స్పందన'లో స్వల్ప తోపులాట..కింద పడిన వృద్ధురాలు

తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో స్పందన కార్యక్రమంలో ఓ వృధ్దురాలు క్యూలైన్​​లో కింద పడిపోయింది. హాల్​ కిక్కిరిసి స్వల్ప తోపులాట జరగటంతో ఈ ఘటన చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న జేసీ ఆమెను కలెక్టర్​ వద్దకు తీసుకెళ్లారు.

author img

By

Published : Aug 19, 2019, 3:17 PM IST

old-women-fell-down-on-spandana-program
'స్పందన'లో క్యూలైన్‌లో కింద పడిపోయిన వృద్ధురాలు

కాకినాడ కలెక్టరేట్​లోని స్పందన కార్యక్రమంలో ఓ వృద్ధురాలు కిందపడింది. అర్జీ పెట్టుకునేందుకు జగన్నాథపురానికి చెందిన బొమ్మిడి సత్యవతి కలెక్టరేట్‌కు వచ్చింది. సత్యవతి కుమారుడు రెండు నెలల క్రితం అనారోగ్యంతో మరణించాడు. బీమా పథకం కింద రావాల్సిన సొమ్ము రాలేదు. దీనితో 'స్పందన'లో అధికారులను కలసి సమస్యను మొర పెట్టుకునేందుకు కలెక్టరేట్​కు వచ్చింది. దరఖాస్తుదారులు భారీగా తరలిరావడంతో హాలు కిక్కిరిసి స్వల్ప తోపులాట జరిగింది. ఈ తోపులాటలో సత్యవతి కింద పడిపోయింది. విపరీతమైన కాలునొప్పితో బాధపడుతున్న ఆమెను జాయింట్ కలెక్టర్ రాజకుమారి ఆమెను ఓదార్చి.. కలెక్టర్ మురళీధర్ రెడ్డి వద్దకు తీసుకెళ్లారు. తనకు ఎలాంటి ఆధారం లేదని, బీమా సొమ్ము ఇప్పించి ఆదుకోవాలని సత్యవతి కలెక్టర్‌కు విజ్ఞప్తి చేసింది. సమస్యను వెంటనే పరిష్కరిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించి.. ఇంటి వద్ద వదిలి రావాలని సిబ్బందిని ఆదేశించారు.

'స్పందన'లో క్యూలైన్‌లో కింద పడిపోయిన వృద్ధురాలు

కాకినాడ కలెక్టరేట్​లోని స్పందన కార్యక్రమంలో ఓ వృద్ధురాలు కిందపడింది. అర్జీ పెట్టుకునేందుకు జగన్నాథపురానికి చెందిన బొమ్మిడి సత్యవతి కలెక్టరేట్‌కు వచ్చింది. సత్యవతి కుమారుడు రెండు నెలల క్రితం అనారోగ్యంతో మరణించాడు. బీమా పథకం కింద రావాల్సిన సొమ్ము రాలేదు. దీనితో 'స్పందన'లో అధికారులను కలసి సమస్యను మొర పెట్టుకునేందుకు కలెక్టరేట్​కు వచ్చింది. దరఖాస్తుదారులు భారీగా తరలిరావడంతో హాలు కిక్కిరిసి స్వల్ప తోపులాట జరిగింది. ఈ తోపులాటలో సత్యవతి కింద పడిపోయింది. విపరీతమైన కాలునొప్పితో బాధపడుతున్న ఆమెను జాయింట్ కలెక్టర్ రాజకుమారి ఆమెను ఓదార్చి.. కలెక్టర్ మురళీధర్ రెడ్డి వద్దకు తీసుకెళ్లారు. తనకు ఎలాంటి ఆధారం లేదని, బీమా సొమ్ము ఇప్పించి ఆదుకోవాలని సత్యవతి కలెక్టర్‌కు విజ్ఞప్తి చేసింది. సమస్యను వెంటనే పరిష్కరిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించి.. ఇంటి వద్ద వదిలి రావాలని సిబ్బందిని ఆదేశించారు.

Intro:పూటుగా మద్యం సేవించి తాళి కట్టిన ఆలిని కోరిక తీర్చాలని బలవంతంగా అత్యాచారం జరిపిన సంఘటన చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చోటుచేసుకుంది. యాదమరి మండలం బీసీ కండిగకు చెందిన పద్మ తన ఎనిమిదేళ్ల బాలికకు జ్వరం రావడంతో చికిత్స కోసం చిత్తూరు ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో అడ్మిట్ చేశారు. అయితే పద్మ భర్త నందయ్య ఆదివారం అర్ధరాత్రి ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి భార్యను కోరిక తీర్చాలని అడిగాడు. దీనికి ససేమిరా అనడంతో పద్మను బలవంతంగా చిన్న పిల్లల వార్డు భవనంపై కి తీసుకెళ్లి అత్యాచారం జరిపాడు. ఈ సందర్భంలో ఆమెపై విచక్షణా రహితంగా దాడి చేయడంతో ఆమెకు తీవ్ర రక్త స్రావం అయ్యింది. శరీరంలో అత్యాచారం జరిపిన చోట రక్త స్రావం ఎక్కువగా జరగడం తో ఆమె అపస్మారక స్థితికి వెళ్ళిపోయింది. ఆమెను గుర్తించిన సహ రోగుల సహాయకులు అత్యవసర చికిత్స నిమిత్తం అదే ఆస్పత్రిలో చేర్పించారు. ఓ మహిళపై రాత్రి వేళ ఇంతటి ఘాతుకం జరిగినా సెక్యురిటీ సిబ్బంది, ఔట్ పోస్ట్ లోని పోలీసులకు తెలియక పోవడం గమనార్హం. ఈ సంఘటనతో ఆస్పత్రిలో రోగులు వారి సహాయకుల రక్షణ ఏపాటిదో తేటతెల్లమైంది.


Body:.


Conclusion:.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.