ETV Bharat / state

పోటెత్తిన గోదారమ్మ.. గ్రాసం లేక పశువుల విలవిల

author img

By

Published : Aug 21, 2020, 9:53 AM IST

తూర్పుగోదావరి జిల్లాలోని లంక భూములను వరద ముంచెత్తడంతో.. పశువులు గ్రాసం లేక విలవిలలాడుతున్నాయి. పశువులకు గడ్డి అందించి తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

no grass for cattle due to flood at  east godavari
గ్రాసం లేక పశువుల విలవిల
గ్రాసం లేక పశువుల విలవిల

గోదావరి వరద ఇంకా కొనసాగుతూనే ఉంది. తూర్పుగోదావరి జిల్లాలోని లంక భూములను వరద ముంచెత్తింది. ఈ కారణంగా లంకలో ఉన్న పశువులను ఏటిగట్టు మీదకు తరలించారు రైతులు. లంక భూములు వరద నీటిలో ఉండటంతో మేతకు తీవ్ర కొరత ఏర్పడింది. మేత లేక పశువులు విలవిలలాడుతున్నాయి.

no grass for cattle due to flood at  east godavari
గ్రాసం లేక పశువుల విలవిల

మొత్తం జిల్లాలోని పశుసంపదలో 30 శాతం పైబడి గోదావరి లంక భూముల్లో లభించే పచ్చిమేతపై ఆధారపడి ఉన్నాయి. గత ఆరు రోజులుగా వరదల కారణంగా పశువులకు గ్రాసం లేక రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. అక్కడ లభించిన ఎండు గడ్డిని రైతులు తీసుకెళ్లి పశువులకు వేస్తున్నారు.

ప్రభుత్వ పరంగా జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లోని పశువులకు 188 టన్నుల సైలేజ్ గడ్డి రైతులకు అందించామని తూర్పు గోదావరి జిల్లా పశుసంవర్ధక సంయుక్త సంచాలకుడు డాక్టర్ ఎన్​టీ శ్రీనివాసరావు తెలిపారు. ప్రభుత్వం అందించే మేత ఏ మాత్రం సరిపోవడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు.

ఇదీ చదవండి: పెట్టుబడిదారులకు అనువుగా నూతన పర్యటక పాలసీ: సీఎం జగన్​

గ్రాసం లేక పశువుల విలవిల

గోదావరి వరద ఇంకా కొనసాగుతూనే ఉంది. తూర్పుగోదావరి జిల్లాలోని లంక భూములను వరద ముంచెత్తింది. ఈ కారణంగా లంకలో ఉన్న పశువులను ఏటిగట్టు మీదకు తరలించారు రైతులు. లంక భూములు వరద నీటిలో ఉండటంతో మేతకు తీవ్ర కొరత ఏర్పడింది. మేత లేక పశువులు విలవిలలాడుతున్నాయి.

no grass for cattle due to flood at  east godavari
గ్రాసం లేక పశువుల విలవిల

మొత్తం జిల్లాలోని పశుసంపదలో 30 శాతం పైబడి గోదావరి లంక భూముల్లో లభించే పచ్చిమేతపై ఆధారపడి ఉన్నాయి. గత ఆరు రోజులుగా వరదల కారణంగా పశువులకు గ్రాసం లేక రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. అక్కడ లభించిన ఎండు గడ్డిని రైతులు తీసుకెళ్లి పశువులకు వేస్తున్నారు.

ప్రభుత్వ పరంగా జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లోని పశువులకు 188 టన్నుల సైలేజ్ గడ్డి రైతులకు అందించామని తూర్పు గోదావరి జిల్లా పశుసంవర్ధక సంయుక్త సంచాలకుడు డాక్టర్ ఎన్​టీ శ్రీనివాసరావు తెలిపారు. ప్రభుత్వం అందించే మేత ఏ మాత్రం సరిపోవడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు.

ఇదీ చదవండి: పెట్టుబడిదారులకు అనువుగా నూతన పర్యటక పాలసీ: సీఎం జగన్​

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.