మాదిగల సమావేశంపై ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ ఛైర్మన్ కారెం శివాజీ మాట్లాడిన తీరును.. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని ఎమ్మార్పీఎస్ తీవ్రంగా ఖండించింది. మాదిగల హక్కుల సాధన కోసం గుంటూరులో నిర్వహించిన సమావేశం మీద.. సీబీ సీఐడీ విచారణ జరిపించాలని ఆయన వ్యాఖ్యానించారు.
మాదిగ రాజకీయ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ఆకుమర్తి చిన్న మాదిగ.. ఆయన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శివాజీ మీద గతంలో అనేక ఆరోపణలు వచ్చాయని.. వాటిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. మాదిగల పట్ల జరుగుతున్న అన్యాయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. శివాజీ సమావేశం ఎక్కడ జరిగినా.. 5 లక్షల మందితో అక్కడ సభ నిర్వహిస్తామని హెచ్చరించారు.
ఇదీ చదవండి: నేరస్థులతో వైకాపా నిండిపోయింది:ఎమ్మెల్సీ రామ్మోహన్