ETV Bharat / state

అత్యాచార బాధితురాలిని పరామర్శించిన మంత్రి తానేటి వనిత

తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో చికిత్స పొందుతున్న అత్యాచార బాధితురాలిని మంత్రి తానేటి వనిత పరామర్శించారు. బాధితురాలికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యుల్ని ఆదేశించారు.

author img

By

Published : Nov 29, 2020, 11:51 AM IST

taneti vanitha
తానేటి వనిత, మంత్రి

ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం ఘటన సభ్యసమాజం తలదించుకునేలా చేసిందని మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి తానేటి వనిత అన్నారు. ఇంట్లో నిద్రిస్తున్న ఐదేళ్ల బాలికను ఓ గుర్తు తెలియని కామాంధుడు ఎత్తుకెళ్లి అత్యాచారం చేసిన ఘటన బుధవారం తెల్లవారుజామున తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో జరిగిన విషయం తెలిసిందే.

కాకినాడ జీజీహెచ్​లో చికిత్స పొందుతున్న బాధితురాలిని మంత్రి పరామర్శించారు. బాలికకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యుల్ని ఆదేశించారు. నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారని తెలిపారు. బాధితురాలి పేరిట రూ.10 లక్షలు డిపాజిట్ చేయనున్నట్లు చెప్పారు.

ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం ఘటన సభ్యసమాజం తలదించుకునేలా చేసిందని మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి తానేటి వనిత అన్నారు. ఇంట్లో నిద్రిస్తున్న ఐదేళ్ల బాలికను ఓ గుర్తు తెలియని కామాంధుడు ఎత్తుకెళ్లి అత్యాచారం చేసిన ఘటన బుధవారం తెల్లవారుజామున తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో జరిగిన విషయం తెలిసిందే.

కాకినాడ జీజీహెచ్​లో చికిత్స పొందుతున్న బాధితురాలిని మంత్రి పరామర్శించారు. బాలికకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యుల్ని ఆదేశించారు. నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారని తెలిపారు. బాధితురాలి పేరిట రూ.10 లక్షలు డిపాజిట్ చేయనున్నట్లు చెప్పారు.

ఇవీ చదవండి..

జగన్‌ అక్రమాస్తుల వ్యవహారంలో ఐఏఎస్‌ శ్రీలక్ష్మి పిటిషన్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.