ETV Bharat / state

వేసవి విడిదికి వచ్చింది... దారి తప్పింది!

author img

By

Published : May 4, 2020, 6:02 PM IST

గోదావరి నదీతీరం.. ఎన్నో అందాలకు నిలయం. పచ్చని చెట్లు.. ప్రకృతి ఒడిలో సేదతీరే పక్షులకు ఆనందాల హరివిల్లు. ఈ అందాలన్నింటినీ చూస్తూ.. తమ సంతతని పెంచుకోవడానికి వేసవి విడిదిగా పక్షులు.. వలస వస్తుంటాయి. అలా వచ్చిన పక్షుల గుంపులో నుంచి ఓ పక్షి తప్పిపోయింది. మన వాళ్లు మాత్రం దానికి సపర్యలు చేస్తూ మురిసిపోతున్నారు.

Migratory bird missing in their group and fall in to a grantu fish pond in east godavri
Migratory bird missing in their group and fall in to a grantu fish pond in east godavri

తూర్పు గోదావరి జిల్లాలో నదీ పరివాహక ప్రాంతాలన్నీ.. మడ అడవులతో విస్తరించి ఉండడంతో... విదేశాలకు చెందిన అనేక రకాల పక్షి జాతులు వలస వస్తుంటాయి. ఈ నేపథ్యంలోనే తాళ్ళరేవు మండలం కోరంగిలోని అభయారణ్యానికి... వేసవి విడిదిగా.. పలు రకాల విదేశీ పక్షులు వలస వస్తుంటాయి. అలా ఈసారి కూడా వలస వచ్చిన పక్షుల గుంపులో నుంచి ఓ పక్షి దారి తప్పింది.

బాతు కాళ్లు, కొంగ ముక్కు కలగలిసిన ఈ పక్షి... తాళ్ళరేవు మండలం గ్రాంటు గ్రామంలోని రాయుడు రాంబాబు చేపల చెరువులో.. తెల్లవారుజామున పడి ఉంది. దీన్ని గమనించిన వారు.. ఒడ్డుకు చేర్చి సపర్యలు చేశారు. రాజమహేంద్రవరం అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.

తూర్పు గోదావరి జిల్లాలో నదీ పరివాహక ప్రాంతాలన్నీ.. మడ అడవులతో విస్తరించి ఉండడంతో... విదేశాలకు చెందిన అనేక రకాల పక్షి జాతులు వలస వస్తుంటాయి. ఈ నేపథ్యంలోనే తాళ్ళరేవు మండలం కోరంగిలోని అభయారణ్యానికి... వేసవి విడిదిగా.. పలు రకాల విదేశీ పక్షులు వలస వస్తుంటాయి. అలా ఈసారి కూడా వలస వచ్చిన పక్షుల గుంపులో నుంచి ఓ పక్షి దారి తప్పింది.

బాతు కాళ్లు, కొంగ ముక్కు కలగలిసిన ఈ పక్షి... తాళ్ళరేవు మండలం గ్రాంటు గ్రామంలోని రాయుడు రాంబాబు చేపల చెరువులో.. తెల్లవారుజామున పడి ఉంది. దీన్ని గమనించిన వారు.. ఒడ్డుకు చేర్చి సపర్యలు చేశారు. రాజమహేంద్రవరం అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.

ఇదీ చదవండి:

లాక్​డౌన్​లో ప్రకృతి సోయగాలు..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.