తూర్పు గోదావరి జిల్లా ఆలమూరు మండలం చొప్పెల్లలో ఇంటి సరిహద్దు వివాదంలో ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. చొప్పెల్లలోని పంచాయతీ సమీపంలో నివసిస్తున్న కస్సే చంటియ్య, మాదే నాగపండు వారి ఇళ్ల సరిహద్దుకు సంబంధించి ఆదివారం సాయంత్రం ఘర్షణ పడ్డారు. ఈ ఘర్షణలో ఇరువురు రాళ్లు, కర్రలతో దాడి చేసుకోవడంతో ఇద్దరికి గాయాలయ్యాయి. స్థానికులు 108కు సమాచారం అందించడంతో వారి ఇరువురిని రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ఇదీ చదవండి: సూక్ష్మ సేద్యానికి కేటాయింపులే.. ఖర్చు శూన్యం..!