లాక్ డౌన్ కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతుంటే వైకాపా నాయకులు మాత్రం వారి జీవితాలతో ఆడుకుంటున్నారని తెదేపా నేత జ్యోతుల నెహ్రూ విమర్శించారు. రైతులకు నీరందించే ఏలేరు కాలువపై ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణం చేపట్టి వారి పొలాలకు నీరందకుండా చేస్తున్నారని విమర్శించారు.
కాలువ మూసేయటం వల్ల పొలాలకు నీళ్లు అందడం కష్టంగా మారిందని ఆయన చెప్పారు. సత్వరమే అధికారులు స్పందించాలన్నారు. కాలువపై నిర్మాణాన్ని ఆపేయాలని కోరారు.