ETV Bharat / state

కొత్తపేటలో జనతా కర్ఫ్యూ... వెలవెలబోతున్న రహదారులు - janatha curfew in kothapeta

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు జనతా కర్ఫ్యూను ప్రజలు స్వచ్ఛందంగా పాటిస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా కొత్తపేటలో ప్రజలంతా ఇళ్లకే పరిమితమవ్వటంతో రహదారులు నిర్మానుష్యంగా మారాయి.

janatha curfew in kothapeta
కొత్తపేటలో జనతా కర్ఫ్యూ
author img

By

Published : Mar 22, 2020, 12:51 PM IST

కొత్తపేటలో జనతా కర్ఫ్యూ

తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గంలోని రావులపాలెం, ఆత్రేయపురం, ఆలమూరు, కొత్తపేట మండలం ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. వ్యాపారులు స్వచ్ఛందంగా తమ దుకాణాలను మూసివేశారు. రావులపాలెంలో ఎంతో రద్దీగా ఉండే 16వ నెంబరు జాతీయ రహదారి వాహనాల తాకిడి లేక వెలవెలబోయింది. ఆర్టీసీ బస్సులు డిపోకే పరిమితం కావడంతో బస్టాండ్​ ప్రయాణికులు లేక నిర్మానుష్యంగా మారింది.

ఇదీ చదవండి: జనతా కర్ఫ్యూ.. రాజమహేంద్రవరంలో రహదారులు వెలవెల

కొత్తపేటలో జనతా కర్ఫ్యూ

తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గంలోని రావులపాలెం, ఆత్రేయపురం, ఆలమూరు, కొత్తపేట మండలం ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. వ్యాపారులు స్వచ్ఛందంగా తమ దుకాణాలను మూసివేశారు. రావులపాలెంలో ఎంతో రద్దీగా ఉండే 16వ నెంబరు జాతీయ రహదారి వాహనాల తాకిడి లేక వెలవెలబోయింది. ఆర్టీసీ బస్సులు డిపోకే పరిమితం కావడంతో బస్టాండ్​ ప్రయాణికులు లేక నిర్మానుష్యంగా మారింది.

ఇదీ చదవండి: జనతా కర్ఫ్యూ.. రాజమహేంద్రవరంలో రహదారులు వెలవెల

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.