ETV Bharat / state

రైతు భరోసా కేంద్రాల్లోనే ధాన్యం సేకరణ

author img

By

Published : May 24, 2021, 12:50 PM IST

తూర్పు గోదావరి జిల్లాలో వచ్చే ఖరీఫ్‌ నుంచి రైతు భరోసా కేంద్రాల ద్వారానే ధాన్యం సేకరించాలని నిర్ణయించారు. కొనుగోలు కేంద్రాలకు సెలవు పలకనున్నారు. 2010లో కోనసీమలో రైతులు పంట విరామం ప్రకటించారు. పండించిన ధాన్యానికి కనీస మద్దతు ధర దక్కడం లేదని, విపత్తులతో నష్టపోతున్న అన్నదాతలకు భరోసా ఇవ్వడం లేదని పంట విరామానికి పూనుకున్నారు. అప్పటినుంచి రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. వీటిని కొనసాగిస్తూ వస్తున్నారు.

ధాన్యం కొనుగోలు
paddy procurment

తూర్పు గోదావరి జిల్లాలోని ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు, డ్వాక్రా సంఘాలు, జిల్లా వ్యవసాయ సహకార మార్కెటింగ్‌ కమిటీ, రైతు మిత్ర గ్రూపుల ద్వారా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏటా నిర్వహిస్తున్నారు. రైతుల వద్ద నుంచి ధాన్యాన్ని సేకరించినందుకు ప్రతి సీజన్‌లో రూ.కోట్లలో కమీషన్‌ చెల్లిస్తున్నారు. వైకాపా ప్రభుత్వం రైతులకు మరిన్ని సేవలను క్షేత్రస్థాయిలో అందించాలని రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసింది. వచ్చే ఖరీఫ్‌ నుంచి ధాన్యం సేకరణ ప్రక్రియను రైతు భరోసా కేంద్రాల ద్వారానే చేపట్టాలని పౌరసరఫరాల సంస్థ ఉన్నతాధికారులు నిర్ణయించారు. సొసైటీలకు ఇచ్చే కమీషన్‌ను రైతు భరోసా కేంద్రాలకు మళ్లించడం ద్వారా వీటిని మరింత బలోపేతం చేయాలని భావిస్తున్నారు. ప్రభుత్వ శాఖలకు చెందిన విభాగాలతో ధాన్యం సేకరణ చేస్తే కమీషన్‌ ఇచ్చే అవకాశం ఉండదు. దీన్ని అధిగమించడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. ఏదో ఒక ఏజెన్సీని మనుగడలోకి తెచ్చి, దాన్ని రైతు భరోసా కేంద్రానికి అనుసంధానం చేయడం ద్వారా వీటికి ప్రయోజనం చేకూర్చాలని కార్యాచరణ రూపొందిస్తున్నారు.

ఒకేచోట నుంచి కార్యకలాపాలు

జిల్లాలో ప్రస్తుతం రెండుచోట్ల నుంచి ధాన్యం సేకరణ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. వివిధ సొసైటీల ద్వారా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు రైతు భరోసా కేంద్రాలను అనుసంధానం చేశారు. ప్రస్తుత రబీ సీజన్‌లో 375 ధాన్యం కొనుగోలు కేంద్రాలను నెలకొల్పి, 885 రైతు భరోసా కేంద్రాలకు అనుసంధానించారు. దీంతో రైతులు ముందుగా రైతు భరోసా కేంద్రాలకు వెళ్లి ధాన్యం నమూనాల తేమ శాతాన్ని పరీక్షించుకుని, తరువాత కొనుగోలు కేంద్రాలకు వెళ్లి విక్రయించుకోవాల్సి వస్తోంది. ఇక వచ్చే సీజన్‌ నుంచి ఈ విధానానికి స్వస్తి పలికి, అన్ని ప్రక్రియలు రైతు భరోసా కేంద్రాల ద్వారానే నిర్వహించాలని భావిస్తున్నారు. ప్రస్తుతం క్వింటా ధాన్యం సేకరణకు రూ.31.25 చొప్పున కొనుగోలు కేంద్రాలకు కమీషన్‌ ఇస్తున్నారు. ఏటా ఖరీఫ్‌, రబీ సీజన్లలో సరాసరి 15 లక్షల మెట్రిక్‌ టన్నుల వరకు ధాన్యాన్ని సేకరిస్తున్నారు. తద్వారా ఈ కేంద్రాలకు రూ.కోట్లలో కమీషన్‌ వస్తోంది. ఇక వీటిని రద్దు చేసి, రైతు భరోసా కేంద్రాల ద్వారానే ధాన్యాన్ని సేకరించనున్నారు.

కరప మండలంలో పైలట్‌ ప్రాజెక్టు

వచ్చే ఖరీఫ్‌ సీజన్‌ నుంచి రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణ నేపథ్యంలో ప్రస్తుత రబీలో కరప మండలంలో పైలట్‌ ప్రాజెక్టు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మండలంలోని నడకుదురు రైతు భరోసా కేంద్రంలో నేరుగా ధాన్యం సేకరణ చేయనున్నారు. జిల్లాలో 1,200కు పైగా రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి. ఇవి ఉన్న చోట ఎక్కువ స్థలం, రాకపోకలకు అనుకూలంగా ఉన్న వాటిని ఎంపిక చేసుకుని, వచ్చే సీజన్‌ నుంచి వీటి వద్దే ధాన్యం సేకరణ చేయాలని భావిస్తున్నారు. నూతన విధానంపై పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజరు ఇ.లక్ష్మిరెడ్డిని విరణ కోరగా ఖరీఫ్‌ నుంచి రైతు భరోసా కేంద్రాల ద్వారానే ధాన్యం సేకరణ చేయాలని ప్రాథమికంగా నిర్ణయించారని చెప్పారు. రైతులు కొనుగోలు కేంద్రాలు, రైతు భరోసా కేంద్రాలకు తిరగకుండా ఒకేచోట నుంచి కార్యకలాపాలు సాగించాలని భావిస్తున్నారన్నారు. ఇప్పటికే రైతు భరోసా కేంద్రాలకు పూర్తిస్థాయిలో సిబ్బంది ఉన్నారని, దీనికి సంబంధించిన ఉత్తర్వులు త్వరలో వస్తాయని చెప్పారు.

ఇదీ చదవండీ.. డాక్టర్ సుధాకర్ కుటుంబసభ్యులకు లోకేశ్ పరామర్శ

తూర్పు గోదావరి జిల్లాలోని ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు, డ్వాక్రా సంఘాలు, జిల్లా వ్యవసాయ సహకార మార్కెటింగ్‌ కమిటీ, రైతు మిత్ర గ్రూపుల ద్వారా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏటా నిర్వహిస్తున్నారు. రైతుల వద్ద నుంచి ధాన్యాన్ని సేకరించినందుకు ప్రతి సీజన్‌లో రూ.కోట్లలో కమీషన్‌ చెల్లిస్తున్నారు. వైకాపా ప్రభుత్వం రైతులకు మరిన్ని సేవలను క్షేత్రస్థాయిలో అందించాలని రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసింది. వచ్చే ఖరీఫ్‌ నుంచి ధాన్యం సేకరణ ప్రక్రియను రైతు భరోసా కేంద్రాల ద్వారానే చేపట్టాలని పౌరసరఫరాల సంస్థ ఉన్నతాధికారులు నిర్ణయించారు. సొసైటీలకు ఇచ్చే కమీషన్‌ను రైతు భరోసా కేంద్రాలకు మళ్లించడం ద్వారా వీటిని మరింత బలోపేతం చేయాలని భావిస్తున్నారు. ప్రభుత్వ శాఖలకు చెందిన విభాగాలతో ధాన్యం సేకరణ చేస్తే కమీషన్‌ ఇచ్చే అవకాశం ఉండదు. దీన్ని అధిగమించడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. ఏదో ఒక ఏజెన్సీని మనుగడలోకి తెచ్చి, దాన్ని రైతు భరోసా కేంద్రానికి అనుసంధానం చేయడం ద్వారా వీటికి ప్రయోజనం చేకూర్చాలని కార్యాచరణ రూపొందిస్తున్నారు.

ఒకేచోట నుంచి కార్యకలాపాలు

జిల్లాలో ప్రస్తుతం రెండుచోట్ల నుంచి ధాన్యం సేకరణ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. వివిధ సొసైటీల ద్వారా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు రైతు భరోసా కేంద్రాలను అనుసంధానం చేశారు. ప్రస్తుత రబీ సీజన్‌లో 375 ధాన్యం కొనుగోలు కేంద్రాలను నెలకొల్పి, 885 రైతు భరోసా కేంద్రాలకు అనుసంధానించారు. దీంతో రైతులు ముందుగా రైతు భరోసా కేంద్రాలకు వెళ్లి ధాన్యం నమూనాల తేమ శాతాన్ని పరీక్షించుకుని, తరువాత కొనుగోలు కేంద్రాలకు వెళ్లి విక్రయించుకోవాల్సి వస్తోంది. ఇక వచ్చే సీజన్‌ నుంచి ఈ విధానానికి స్వస్తి పలికి, అన్ని ప్రక్రియలు రైతు భరోసా కేంద్రాల ద్వారానే నిర్వహించాలని భావిస్తున్నారు. ప్రస్తుతం క్వింటా ధాన్యం సేకరణకు రూ.31.25 చొప్పున కొనుగోలు కేంద్రాలకు కమీషన్‌ ఇస్తున్నారు. ఏటా ఖరీఫ్‌, రబీ సీజన్లలో సరాసరి 15 లక్షల మెట్రిక్‌ టన్నుల వరకు ధాన్యాన్ని సేకరిస్తున్నారు. తద్వారా ఈ కేంద్రాలకు రూ.కోట్లలో కమీషన్‌ వస్తోంది. ఇక వీటిని రద్దు చేసి, రైతు భరోసా కేంద్రాల ద్వారానే ధాన్యాన్ని సేకరించనున్నారు.

కరప మండలంలో పైలట్‌ ప్రాజెక్టు

వచ్చే ఖరీఫ్‌ సీజన్‌ నుంచి రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణ నేపథ్యంలో ప్రస్తుత రబీలో కరప మండలంలో పైలట్‌ ప్రాజెక్టు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మండలంలోని నడకుదురు రైతు భరోసా కేంద్రంలో నేరుగా ధాన్యం సేకరణ చేయనున్నారు. జిల్లాలో 1,200కు పైగా రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి. ఇవి ఉన్న చోట ఎక్కువ స్థలం, రాకపోకలకు అనుకూలంగా ఉన్న వాటిని ఎంపిక చేసుకుని, వచ్చే సీజన్‌ నుంచి వీటి వద్దే ధాన్యం సేకరణ చేయాలని భావిస్తున్నారు. నూతన విధానంపై పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజరు ఇ.లక్ష్మిరెడ్డిని విరణ కోరగా ఖరీఫ్‌ నుంచి రైతు భరోసా కేంద్రాల ద్వారానే ధాన్యం సేకరణ చేయాలని ప్రాథమికంగా నిర్ణయించారని చెప్పారు. రైతులు కొనుగోలు కేంద్రాలు, రైతు భరోసా కేంద్రాలకు తిరగకుండా ఒకేచోట నుంచి కార్యకలాపాలు సాగించాలని భావిస్తున్నారన్నారు. ఇప్పటికే రైతు భరోసా కేంద్రాలకు పూర్తిస్థాయిలో సిబ్బంది ఉన్నారని, దీనికి సంబంధించిన ఉత్తర్వులు త్వరలో వస్తాయని చెప్పారు.

ఇదీ చదవండీ.. డాక్టర్ సుధాకర్ కుటుంబసభ్యులకు లోకేశ్ పరామర్శ

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.