ETV Bharat / state

సీతానగరం శిరోముండనం నిందితులకు, వైకాపా నాయకులకు ఊరట

author img

By

Published : Sep 9, 2020, 1:27 PM IST

సీతానగరం ఎస్సీ యువకుడి శిరోముండనం కేసులో నిందితులకు, వైకాపా నాయకులకు హైకోర్టులో ఊరట లభించింది. తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు వారిని అరెస్టు చేయవద్దని కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

high court
హైకోర్టు

తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం ఠాణాలో ఎస్సీ యువకుడి శిరోముండనం కేసులో నిందితులు, వైకాపా నాయకులకు హైకోర్టులో ఊరట లభించింది . ఈ కేసులో వారిపై అరెస్ట్​తో పాటు తదుపరి చర్యలన్నింటిని నిలువరిస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. వ్యాజ్యంలో ప్రతివాదిగా ఉన్న శిరోముండన బాధితుడు ప్రసాద్​కు నోటీసులు జారీచేసింది.

ఇసుక మాఫియాను ఎదురించినందుకు వైకాపా నేత కవల కృష్ణమూర్తి , ఆయన అనుచరులు శిరోముండనం చేయించారని బాధితుడు ఆరోపించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు సీతానగరం పోలీసులు వైకాపా నేత కె . కృష్ణమూర్తి, ఆయన అనుచరులు కె.వెంకటనాగదుర్గ శివప్రసాద్ , కె.వీరబాబు , కె.నాగేంద్రబాబు , ఏ.పుష్కరం, ఏ. భూషణం, ఎస్పై తదితరులపై కేసు నమోదు చేశారు. తమపై కేసును కొట్టేయాలని కోరుతూ కృష్ణమూర్తితో పాటు ఆయన అనుచరులు హైకోర్టును ఆశ్రయించారు. తమను తప్పుడు కేసులో ఇరికించారని వారు పేర్కొన్నారు.

పిటిషనర్ల తరపు న్యాయవాది కె.చిదంబరం వాదనలు వినిపిస్తూ... ఇసుక రేవు వద్ద జరిగిన వివాద వ్యవహారంలో ప్రసాద్​పై కృష్ణమూర్తి అనుచరుడు పోలీసులకు ముందుగా ఫిర్యాదు చేశారన్నారు. ఆ కేసులో పోలీసులు ప్రసాద్​ను ఠాణాకు తీసుకెళ్లారన్నారు. శిరోముండనంతో పిటిషనర్లకు సంబంధం లేదన్నారు. శిరోముండనానికి పిటిషనర్లు కారణం అనే తప్పుడు ఆరోపణలతో వారిని కేసులో ఇరికించారన్నారు. ఆ వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. వారిపై తదుపరి చర్యలన్నింటిని నిలువరిస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. విచారణను అక్టోబర్ 5 కు వాయిదా వేసింది.

ఇదీ చదవండి: న్యాయం అడిగితే.. అరెస్టు చేస్తారా?

తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం ఠాణాలో ఎస్సీ యువకుడి శిరోముండనం కేసులో నిందితులు, వైకాపా నాయకులకు హైకోర్టులో ఊరట లభించింది . ఈ కేసులో వారిపై అరెస్ట్​తో పాటు తదుపరి చర్యలన్నింటిని నిలువరిస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. వ్యాజ్యంలో ప్రతివాదిగా ఉన్న శిరోముండన బాధితుడు ప్రసాద్​కు నోటీసులు జారీచేసింది.

ఇసుక మాఫియాను ఎదురించినందుకు వైకాపా నేత కవల కృష్ణమూర్తి , ఆయన అనుచరులు శిరోముండనం చేయించారని బాధితుడు ఆరోపించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు సీతానగరం పోలీసులు వైకాపా నేత కె . కృష్ణమూర్తి, ఆయన అనుచరులు కె.వెంకటనాగదుర్గ శివప్రసాద్ , కె.వీరబాబు , కె.నాగేంద్రబాబు , ఏ.పుష్కరం, ఏ. భూషణం, ఎస్పై తదితరులపై కేసు నమోదు చేశారు. తమపై కేసును కొట్టేయాలని కోరుతూ కృష్ణమూర్తితో పాటు ఆయన అనుచరులు హైకోర్టును ఆశ్రయించారు. తమను తప్పుడు కేసులో ఇరికించారని వారు పేర్కొన్నారు.

పిటిషనర్ల తరపు న్యాయవాది కె.చిదంబరం వాదనలు వినిపిస్తూ... ఇసుక రేవు వద్ద జరిగిన వివాద వ్యవహారంలో ప్రసాద్​పై కృష్ణమూర్తి అనుచరుడు పోలీసులకు ముందుగా ఫిర్యాదు చేశారన్నారు. ఆ కేసులో పోలీసులు ప్రసాద్​ను ఠాణాకు తీసుకెళ్లారన్నారు. శిరోముండనంతో పిటిషనర్లకు సంబంధం లేదన్నారు. శిరోముండనానికి పిటిషనర్లు కారణం అనే తప్పుడు ఆరోపణలతో వారిని కేసులో ఇరికించారన్నారు. ఆ వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. వారిపై తదుపరి చర్యలన్నింటిని నిలువరిస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. విచారణను అక్టోబర్ 5 కు వాయిదా వేసింది.

ఇదీ చదవండి: న్యాయం అడిగితే.. అరెస్టు చేస్తారా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.