తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు మండలంలో పలు గ్రామాలు జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. గొల్లప్రోలులో వందల ఇళ్లలోకి నీరు చేరింది. లక్ష్మీపురం, సీతానగరం, మల్లవరం, చేబ్రోలు, తాటిపర్తి, గొల్లప్రోలులో వేల ఎకరాల్లో వరి, పత్తి, మిరప, ఉల్లి, కూరగాయపంటలు నీట మునిగాయి. ఏలేరు వరదతోపాటు సుద్దగడ్డ వాగు పొంగి పొర్లడంతో 216 జాతీయ రహదారితోపాటు వివిధ రహదారులపో వరద నీరు ప్రవహించింది. రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి.
ఇదీచదవండి