ETV Bharat / state

FLOODS: గోదావరిలో మరింత పెరుగుతున్న వరద

author img

By

Published : Sep 30, 2021, 7:57 AM IST

Updated : Sep 30, 2021, 12:04 PM IST

గోదావరిలో వరద క్రమంగా పెరుగుతోంది. కోనసీమలో నదీ పాయలు జోరుగా ప్రవహిస్తున్నాయి. ధవళేశ్వరం కాటన్ ఆనకట్ట వద్ద 9 అడుగుల నీటిమట్టం ఉంది.

godavari-floods
godavari-floods
గోదావరిలో క్రమంగా పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం నుంచి ఐదున్నర లక్షల క్యూసెక్కుల విడుదల

ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరిలో వరద మరింత పెరుగుతోంది. పోలవరం కాఫర్ డ్యామ్‌ ఎగువన భారీగా వరద ముంపు ఏర్పడింది. భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. ధవళేశ్వరం కాటన్ ఆనకట్ట వద్ద 9 అడుగుల నీటిమట్టం ఉంది.

తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజీ నుంచి ఈరోజు ఉదయం 9 గంటలకు 6 లక్షల 41,000 క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి విడిచిపెట్టారు. వరద ఇంకా పెరుగుతుంది మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయి వరకు వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. బ్యారేజి నుంచి దిగువన ఉన్న సముద్రంలోకి వరద నీరు విడిచి పెట్టడంతో కోనసీమలోని వశిష్ఠ వైనతేయ గౌతమి గోదావరి నది పాయలు వరద ప్రవాహం పెరిగింది. చాకలి పాలెం సమీపంలోని కనకాయలంక వద్ద కాజ్వే పైకి వరద నీరు చేరుతుంది. కోనసీమలోని వివిధ లంక గ్రామాల ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలోని దేవీపట్నం, కోనసీమ లంకల్ని వరద చుట్టుముట్టింది.

ఇదీ చదవండి: Bhabanipur bypoll: భవానీపూర్​లో పోలింగ్​ ప్రారంభం

గోదావరిలో క్రమంగా పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం నుంచి ఐదున్నర లక్షల క్యూసెక్కుల విడుదల

ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరిలో వరద మరింత పెరుగుతోంది. పోలవరం కాఫర్ డ్యామ్‌ ఎగువన భారీగా వరద ముంపు ఏర్పడింది. భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. ధవళేశ్వరం కాటన్ ఆనకట్ట వద్ద 9 అడుగుల నీటిమట్టం ఉంది.

తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజీ నుంచి ఈరోజు ఉదయం 9 గంటలకు 6 లక్షల 41,000 క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి విడిచిపెట్టారు. వరద ఇంకా పెరుగుతుంది మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయి వరకు వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. బ్యారేజి నుంచి దిగువన ఉన్న సముద్రంలోకి వరద నీరు విడిచి పెట్టడంతో కోనసీమలోని వశిష్ఠ వైనతేయ గౌతమి గోదావరి నది పాయలు వరద ప్రవాహం పెరిగింది. చాకలి పాలెం సమీపంలోని కనకాయలంక వద్ద కాజ్వే పైకి వరద నీరు చేరుతుంది. కోనసీమలోని వివిధ లంక గ్రామాల ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలోని దేవీపట్నం, కోనసీమ లంకల్ని వరద చుట్టుముట్టింది.

ఇదీ చదవండి: Bhabanipur bypoll: భవానీపూర్​లో పోలింగ్​ ప్రారంభం

Last Updated : Sep 30, 2021, 12:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.