కరోనా వైరస్ వ్యాప్తి భయాందోళనకు గురి చేస్తున్నా, ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా సేవలందిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. తూర్పు గోదావరి జిల్లా తునిలో జేసీఐ తుని జ్యూయలర్స్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. వైకాపా నాయకుడు ఏలూరి బాలు చేతుల మీదుగా పురపాలక, ప్రాంతీయ ఆసుపత్రిలో విధులు నిర్వర్తిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు.
ఇదీ చదవండి: పారిశుద్ధ్య సిబ్బందికి 'మూలపేట' దుస్తుల కిట్