తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం నియోజకవర్గం ఊడిమూడి లంక వద్ద గోదావరి నదిపై 50 కోట్ల రూపాయలతో వంతెన నిర్మించేందుకు టెండర్ పిలిచినట్లు పంచాయతీరాజ్ శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ బి.సుబ్బారెడ్డి వెల్లడించారు. బ్రిడ్జ్ నిర్మాణ ప్రదేశాన్ని ఆయన పరిశీలించారు. టెండర్ ప్రక్రియ సాంకేతిక పరిశీలనలో ఉందని... ఇది పూర్తయిన తర్వాత ఆర్థికపరమైన పరిశీలన చేస్తామన్నారు. అన్నీ సజావుగా జరిగితే మే నెలలో వంతెన నిర్మాణం పనులు మొదలవుతాయని సుబ్బారెడ్డి స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: