ETV Bharat / state

కాకినాడ జీజీహెచ్​కు 20కేఎల్​ ఆక్సిజన్​ ప్లాంట్​ విరాళం...

author img

By

Published : Jun 20, 2021, 4:32 PM IST

కాకినాడలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో ఆక్సిజన్ ఉత్పత్తి​ ట్యాంకును బీసీ సంక్షేమ శాఖ మంత్రి వేణు గోపాలకృష్ణ ప్రారంభించారు. అపెక్స్ ఫ్రోజెన్ ఫుడ్స్ అధినేత సత్యనారాయణమూర్తి 20కేఎల్​ సామర్థ్యమున్న ఆక్సిజన్​ ట్యాంకును ఆస్పత్రికి విరాళంగా అందించారు.

Oxygen Tank
ఆక్సిజన్​ ప్లాంట్​ ప్రారంభం

తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో 20కేఎల్​ సామర్థ్యం ఉన్న ఆక్సిజన్​ ప్లాంట్​ను బీసీ సంక్షేమ శాఖ మంత్రి వేణుగోపాలకృష్ణ ప్రారంభించారు. అపెక్స్ ఫ్రోజెన్ ఫుడ్స్ అధినేత సత్యనారాయణమూర్తి 46 లక్షల వ్యయంతో దాన్ని సమకూర్చారు. జీజీహెచ్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ ప్రాంగణంలో ఆక్సిజన్​ ట్యాంకును ఏర్పాటు చేశారు. ఆస్పత్రికి ఆక్సిజన్​ ప్లాంట్​ను అందించిన సంస్థను మంత్రి అభినందించారు.

కరోనా నివారణకు వైద్యులు, పోలీసులు, అధికారులు చర్యలు తీసుకుంటున్నారని.. వారికి ప్రజలు సహకరించాలని కోరారు. అన్నీ జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ జిల్లాలో కరోనా పాజిటివిటీ రేటు 10శాతం దాకా ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కొవిడ్​ను మరింత సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జిల్లా కలెక్టర్​ మరిన్ని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. జీజీహెచ్​ అవసరాల మేరకు వెంటిలేటర్లు, ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేసినట్టు అపెక్స్ ఫ్రోజెన్ ఫుడ్స్ సంస్థ అధినేత సత్యనారాయణ తెలిపారు.

తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో 20కేఎల్​ సామర్థ్యం ఉన్న ఆక్సిజన్​ ప్లాంట్​ను బీసీ సంక్షేమ శాఖ మంత్రి వేణుగోపాలకృష్ణ ప్రారంభించారు. అపెక్స్ ఫ్రోజెన్ ఫుడ్స్ అధినేత సత్యనారాయణమూర్తి 46 లక్షల వ్యయంతో దాన్ని సమకూర్చారు. జీజీహెచ్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ ప్రాంగణంలో ఆక్సిజన్​ ట్యాంకును ఏర్పాటు చేశారు. ఆస్పత్రికి ఆక్సిజన్​ ప్లాంట్​ను అందించిన సంస్థను మంత్రి అభినందించారు.

కరోనా నివారణకు వైద్యులు, పోలీసులు, అధికారులు చర్యలు తీసుకుంటున్నారని.. వారికి ప్రజలు సహకరించాలని కోరారు. అన్నీ జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ జిల్లాలో కరోనా పాజిటివిటీ రేటు 10శాతం దాకా ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కొవిడ్​ను మరింత సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జిల్లా కలెక్టర్​ మరిన్ని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. జీజీహెచ్​ అవసరాల మేరకు వెంటిలేటర్లు, ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేసినట్టు అపెక్స్ ఫ్రోజెన్ ఫుడ్స్ సంస్థ అధినేత సత్యనారాయణ తెలిపారు.

ఇదీ చదవండి: Corona effect: ఈ ఇద్దరి కష్టం.. ఇంకెవరికీ రాకూడదు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.