ETV Bharat / state

పిల్లలతో సహా విషం తాగిన తల్లి.. కుమార్తె మృతి - deth in odalarevu

తూర్పుగోదావరి జిల్లా ఓడలరేవులో విషాదం నెలకొంది. కుమారుడు, కుమార్తె సహా తల్లి విషం తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనలో కుమార్తె మృతిచెందగా... తల్లీ, కుమారుల పరిస్థితి విషమంగా ఉంది.

daughter died in a suicide attempt at odalarevu east godavari district
పిల్లలతో సహా విషం తాగిన తల్లి
author img

By

Published : Apr 7, 2021, 11:04 PM IST

తూర్పుగోదావరి జిల్లాలోని అల్లవరం మండలం ఓడలరేవు గ్రామంలో విషాదం నెలకొంది. మాధవి అనే మహిళ తన కుమారుడు లోహిత్, కుమార్తె హరిణిలకు విషమిచ్చి, ఆమె కూడా విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.

గమనించిన స్థానికులు... బాధితులను అమలాపురం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో కుమార్తె హరిణి మృతి చెందింది. తల్లి మాధవి, కుమారుడు లోహిత్ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. మాధవి భర్త సతీష్ వేధింపులు తట్టుకోలేక మాధవి ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

తూర్పుగోదావరి జిల్లాలోని అల్లవరం మండలం ఓడలరేవు గ్రామంలో విషాదం నెలకొంది. మాధవి అనే మహిళ తన కుమారుడు లోహిత్, కుమార్తె హరిణిలకు విషమిచ్చి, ఆమె కూడా విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.

గమనించిన స్థానికులు... బాధితులను అమలాపురం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో కుమార్తె హరిణి మృతి చెందింది. తల్లి మాధవి, కుమారుడు లోహిత్ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. మాధవి భర్త సతీష్ వేధింపులు తట్టుకోలేక మాధవి ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

ఇదీ చూడండి:

రేపే పరిషత్ ఎన్నికలు: ఇప్పటివరకు ఏం జరిగింది..?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.