ETV Bharat / state

"సంబరాలు చేసుకోవద్దన్నందుకు దాడికి దిగారు.. న్యాయమా?" - బిక్కవోలు వార్తలు

తమపై వైకాపా నాయకులు దాడి చేశారని ఆరోపిస్తూ తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు మండలం ఇల్లపల్లికి చెందిన కొందరు దళితులు... పోలీసు స్టేషన్​ ఎదుట నిరసన తెలిపారు. అనపర్తి తెదేపా మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి వారికి మద్దతుగా నిలిచారు. బాధితుల నుంచి రామచంద్రాపురం డీఎస్పీ బాలచంద్రారెడ్డి ఫిర్యాదు స్వీకరించారు.

Dalits protest
దళితుల నిరసన
author img

By

Published : Feb 15, 2021, 5:25 PM IST

Updated : Feb 15, 2021, 5:46 PM IST

తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు మండలం ఇల్లపల్లికి చెందిన కొందరు దళితులు... స్థానిక పోలీస్ స్టేషన్ ఎదుట నిరసనకు దిగారు. పంచాయతీ ఎన్నికల ఫలితాల తర్వాత విజేతలను సంబరాలు చేసుకోవద్దని కోరినందుకు.. తమపై వైకాపా నాయకులు దాడి చేశారని ఆరోపించారు. పోలీసులు అక్కడే ఉన్నా అడ్డుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

అనపర్తి తెదేపా మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డితో కలిసి ర్యాలీగా పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి నినాదాలు చేశారు. రామచంద్రపురం డీఎస్పీ బాలచంద్రారెడ్డి స్టేషన్ వద్దకు వెళ్లి.. వారితో మాట్లాడారు. బాధితుల నుంచి ఫిర్యాదు స్వీకరించారు. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డీఎస్పీని కోరారు.

తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు మండలం ఇల్లపల్లికి చెందిన కొందరు దళితులు... స్థానిక పోలీస్ స్టేషన్ ఎదుట నిరసనకు దిగారు. పంచాయతీ ఎన్నికల ఫలితాల తర్వాత విజేతలను సంబరాలు చేసుకోవద్దని కోరినందుకు.. తమపై వైకాపా నాయకులు దాడి చేశారని ఆరోపించారు. పోలీసులు అక్కడే ఉన్నా అడ్డుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

అనపర్తి తెదేపా మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డితో కలిసి ర్యాలీగా పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి నినాదాలు చేశారు. రామచంద్రపురం డీఎస్పీ బాలచంద్రారెడ్డి స్టేషన్ వద్దకు వెళ్లి.. వారితో మాట్లాడారు. బాధితుల నుంచి ఫిర్యాదు స్వీకరించారు. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డీఎస్పీని కోరారు.

ఇదీ చదవండి:

యానాంలో వైభవంగా వీరభద్రుని గ్రామోత్సవాలు

Last Updated : Feb 15, 2021, 5:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.