ETV Bharat / state

TIDCO HOUSES: టిడ్కో ఇళ్లు వెంటనే లబ్ధిదారులకు పంపిణీ చేయాలి: రామకృష్ణ

author img

By

Published : Aug 11, 2021, 5:12 PM IST

టిడ్కో ఇళ్లు లబ్ధిదారులకు కేటాయించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో నిర్మించిన టిడ్కో గృహాలను ఆయన పరిశీలించారు.

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేయకుండా ప్రభుత్వం కక్షసాధింపు చర్యలు చేపడుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. కేవలం తెదేపా ప్రభుత్వ హయాంలో ఇచ్చారన్న కారణంగా లబ్ధిదారులకు గృహాలను అందించకపోవడం సరికాదన్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో టిడ్కో గృహాలను ఆయన పరిశీలించారు. టిడ్కో గృహాల వద్ద ఇప్పటికీ కనీస మౌళిక సదుపాయాలు కల్పించలేదని విమర్శించారు.

ఇళ్లు చంద్రబాబు స్వంత నిధులతో నిర్మించలేదని.. ప్రజాధనంతో నిర్మించారని రామకృష్ణ తెలిపారు. మరికొన్ని నెలలు గడిస్తే.. అవి నివాసానికి పనికిరాకుండాపోతాయన్న ఆయన.. ప్రభుత్వం వెంటనే డ్రైనేజీ, రోడ్లు, నీటి సదుపాయం కల్పించి లబ్ధిదారులకు అందజేయాలని డిమాండ్ చేశారు.

టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేయకుండా ప్రభుత్వం కక్షసాధింపు చర్యలు చేపడుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. కేవలం తెదేపా ప్రభుత్వ హయాంలో ఇచ్చారన్న కారణంగా లబ్ధిదారులకు గృహాలను అందించకపోవడం సరికాదన్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో టిడ్కో గృహాలను ఆయన పరిశీలించారు. టిడ్కో గృహాల వద్ద ఇప్పటికీ కనీస మౌళిక సదుపాయాలు కల్పించలేదని విమర్శించారు.

ఇళ్లు చంద్రబాబు స్వంత నిధులతో నిర్మించలేదని.. ప్రజాధనంతో నిర్మించారని రామకృష్ణ తెలిపారు. మరికొన్ని నెలలు గడిస్తే.. అవి నివాసానికి పనికిరాకుండాపోతాయన్న ఆయన.. ప్రభుత్వం వెంటనే డ్రైనేజీ, రోడ్లు, నీటి సదుపాయం కల్పించి లబ్ధిదారులకు అందజేయాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి..

CM Review : వ్యాక్సినేషన్‌లో ఉద్యోగులు, సిబ్బందికి ప్రాధాన్యం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.