ETV Bharat / state

యానాంలో జాతరను తలపించిన ప్రచారం

author img

By

Published : Apr 4, 2021, 5:10 PM IST

ఈ నెల 6 పుదుచ్చేరి అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. నేటితో ఎన్నికలకు సంబంధించిన ప్రచార గడువు ముగిసింది. పోటీలో ఉన్న అభ్యర్థులు...ఓటర్లను కలిసేందుకు గ్రామాల్లో విసృత్తంగా పర్యటిస్తూ... ఓట్లను అభ్యర్థించారు. కేంద్రపాలిత ప్రాంతం యానాంలో ప్రచారాలు జాతరను తలపించింది. మహిళలు డ్యాన్స్ వేస్తూ... అభ్యర్థులకు స్వాగతం పలికారు.

కేంద్ర పాలిత పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా యానాంలో ప్రచారం
కేంద్ర పాలిత పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా యానాంలో ప్రచారం

కేంద్ర పాలిత పుదుచ్చేరి అసెంబ్లీకి మంగళవారం ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నేటితో ప్రచార గడువు ముగిసింది. పోటీలో ఉన్న అభ్యర్థులు ఓటర్లను కలిసేందుకు గ్రామాలలో విస్తృతంగా పర్యటించారు. చివరి అంకంలో ప్రచారం జాతరను తలపించింది.

ఎన్​ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు... రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి రంగస్వామి పోటీలో నిలవడం.. పుదుచ్చేరి రాష్ట్రంతోపాటు ఆంధ్రప్రదేశ్ రాజకీయ పార్టీల్లో చర్చనీయాంశమైంది. ఎన్డీఏ కూటమిలో భాగస్వాములైన ఆయన తరఫున.. రాష్ట్రానికి చెందిన మంత్రులు, రాజ్యసభ సభ్యులు సైతం ప్రచారం చేశారు.

పుదుచ్చేరి రాష్ట్ర మాజీ మంత్రి... యానాం మాజీ శాసనసభ్యులు. మల్లాడి కృష్ణారావు అన్నీ తానై అభ్యర్థి లేకుండానే నియోజకవర్గమంతా ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. చివరి రోజు రాష్ట్ర మంత్రి పినిపే విశ్వరూప్ ఎస్సీ గ్రామాల్లో... కృష్ణారావు మత్స్యకార గ్రామాల్లో ప్రచారానికి వెళ్ళగా... మహిళలు డీజే మోతకు స్టెప్పులేశారు. యువకులు భవనాలపై నుంచి పూలు చల్లుతూ స్వాగతం పలికారు.

కేంద్ర పాలిత పుదుచ్చేరి అసెంబ్లీకి మంగళవారం ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నేటితో ప్రచార గడువు ముగిసింది. పోటీలో ఉన్న అభ్యర్థులు ఓటర్లను కలిసేందుకు గ్రామాలలో విస్తృతంగా పర్యటించారు. చివరి అంకంలో ప్రచారం జాతరను తలపించింది.

ఎన్​ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు... రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి రంగస్వామి పోటీలో నిలవడం.. పుదుచ్చేరి రాష్ట్రంతోపాటు ఆంధ్రప్రదేశ్ రాజకీయ పార్టీల్లో చర్చనీయాంశమైంది. ఎన్డీఏ కూటమిలో భాగస్వాములైన ఆయన తరఫున.. రాష్ట్రానికి చెందిన మంత్రులు, రాజ్యసభ సభ్యులు సైతం ప్రచారం చేశారు.

పుదుచ్చేరి రాష్ట్ర మాజీ మంత్రి... యానాం మాజీ శాసనసభ్యులు. మల్లాడి కృష్ణారావు అన్నీ తానై అభ్యర్థి లేకుండానే నియోజకవర్గమంతా ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. చివరి రోజు రాష్ట్ర మంత్రి పినిపే విశ్వరూప్ ఎస్సీ గ్రామాల్లో... కృష్ణారావు మత్స్యకార గ్రామాల్లో ప్రచారానికి వెళ్ళగా... మహిళలు డీజే మోతకు స్టెప్పులేశారు. యువకులు భవనాలపై నుంచి పూలు చల్లుతూ స్వాగతం పలికారు.

ఇవీ చదవండి:

కొలిమేరు వద్ద ఆటో ద్విచక్ర వాహనం ఢీ.. పది మందికి గాయాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.