ETV Bharat / state

ఒంటరిగా జీవిస్తున్న వృద్ధురాలి హత్య - వృద్ధురాలి హత్య తాజా వార్తలు

ఒంటరిగా జీవిస్తున్న ఓ వృద్ధురాలు హత్యకు గురైన ఘటన.. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో శుక్రవారం జరిగింది. వృద్దురాలు ఉండే గదిలోని బీరువా తెరిచి ఉండటంతో.. గుర్తుతెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడి ఆమెను హతమార్చి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

an 70 years old women was killed by unknown people at rajamahendravaram in east godavari
ఒంటరిగా జీవిస్తోన్న వృద్ధురాలి హత్య
author img

By

Published : Feb 6, 2021, 11:25 AM IST

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఒంటరిగా జీవిస్తున్న ఓ వృద్ధురాలు శుక్రవారం హత్యకు గురైంది.రాజమహేంద్రవరం డీఎస్పీ రవికుమార్‌ తెలిపిన వివరాల మేరకు.. జంగా నారాయణమ్మ(70), తూర్పు రైల్వేస్టేషన్‌ రోడ్డు ఆదర్శనగర్‌లోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటోంది. భర్త సూర్యనారాయణ 30 ఏళ్ల కిందటే మృతి చెందాడు. ఆమెకు సంతానం లేకపోవడంతో ఒంటరిగా జీవిస్తోంది. శుక్రవారం మధ్యాహ్నం వరకూ ఆమె ఇంట్లో నుంచి బయటకు రాకపోవడంతో పక్కింటి వారు వెళ్లి చూసేసరికి ఓ కుర్చీలో విగతజీవిగా ఉంది. దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. గదిలోని బీరువా తెరచి ఉండడంతో గుర్తుతెలియని వ్యక్తి ఇంట్లో చోరీకి వచ్చి ఆమెను హతమార్చి ఉండవచ్చనని సీఐ లక్ష్మణరెడ్డి తెలిపారు.

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఒంటరిగా జీవిస్తున్న ఓ వృద్ధురాలు శుక్రవారం హత్యకు గురైంది.రాజమహేంద్రవరం డీఎస్పీ రవికుమార్‌ తెలిపిన వివరాల మేరకు.. జంగా నారాయణమ్మ(70), తూర్పు రైల్వేస్టేషన్‌ రోడ్డు ఆదర్శనగర్‌లోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటోంది. భర్త సూర్యనారాయణ 30 ఏళ్ల కిందటే మృతి చెందాడు. ఆమెకు సంతానం లేకపోవడంతో ఒంటరిగా జీవిస్తోంది. శుక్రవారం మధ్యాహ్నం వరకూ ఆమె ఇంట్లో నుంచి బయటకు రాకపోవడంతో పక్కింటి వారు వెళ్లి చూసేసరికి ఓ కుర్చీలో విగతజీవిగా ఉంది. దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. గదిలోని బీరువా తెరచి ఉండడంతో గుర్తుతెలియని వ్యక్తి ఇంట్లో చోరీకి వచ్చి ఆమెను హతమార్చి ఉండవచ్చనని సీఐ లక్ష్మణరెడ్డి తెలిపారు.

ఇదీ చదవండి: పక్కా వ్యూహంతోనే శిరోముండనం బాధితుడు ప్రసాద్‌ అదృశ్యం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.