ETV Bharat / state

మదనపల్లెలో విద్యుదాఘాతంతో మహిళ మృతి

విద్యుదాఘాతంతో ఓ మహిళ మృతి చెందిన ఘటన చిత్తూరు జిల్లా మదనపల్లెలో జరిగింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వివాహిత మృతితో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.

author img

By

Published : Jul 5, 2020, 10:42 AM IST

chittor district
మాదనపల్లిలో విద్యుదాఘటంతో మహిళ మృతి.

చిత్తూరు జిల్లా మదనపల్లె పట్టణం ప్యార్నగర్​లో కిరణ్మయి అనే వివాహిత విద్యుదాఘాతంతో మృతి చెందింది. రాత్రి కురిసిన వర్షానికి ఇంటిపైన రేకులపై విద్యుత్​ తీగలు తెగిపడ్డాయి. ఇది గమనించని మహిళ.. బయటకు వెళ్లగా తీగలు తగిలి విద్యుత్​ షాక్​తో అపస్మారక స్థితికి చేరుకుంది. ఇది గమనించిన స్థానికులు జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆమెను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.

మృతురాలు మదనపల్లెలోని స్థానిక ఛానల్​లో న్యూస్ రీడర్‌గా పనిచేసేవారు. ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

చిత్తూరు జిల్లా మదనపల్లె పట్టణం ప్యార్నగర్​లో కిరణ్మయి అనే వివాహిత విద్యుదాఘాతంతో మృతి చెందింది. రాత్రి కురిసిన వర్షానికి ఇంటిపైన రేకులపై విద్యుత్​ తీగలు తెగిపడ్డాయి. ఇది గమనించని మహిళ.. బయటకు వెళ్లగా తీగలు తగిలి విద్యుత్​ షాక్​తో అపస్మారక స్థితికి చేరుకుంది. ఇది గమనించిన స్థానికులు జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆమెను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.

మృతురాలు మదనపల్లెలోని స్థానిక ఛానల్​లో న్యూస్ రీడర్‌గా పనిచేసేవారు. ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి..

ట్రాక్టర్ పైనుంచి జారిపడి బాలిక మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.