ETV Bharat / state

తిరుపతి ఉపఎన్నిక : రైల్వే స్టేషన్ అభివృద్దిపై పార్టీల ప్రచారాస్త్రాలు

author img

By

Published : Apr 11, 2021, 6:03 AM IST

అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకుడు... తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు అసంఖ్యాకంగా తరలివచ్చే భక్తులతో నిత్యం కిటకిటలాడే ప్రాంతం తిరుపతి రైల్వే స్టేషన్. ఆధ్యాత్మిక నగరి, ఆకర్షణీయ నగరాల జాబితాలో ఉన్నా.....పెరుగుతున్న రద్దీ, జనాభాకు అనుగుణంగా స్మార్ట్ రైల్వే స్టేషన్​ కు ప్రణాళికలు రచించినా....పనుల్లో మాత్రం జాప్యమే కనిపిస్తోందని ప్రతిపక్షాలు విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టాయి. తిరుపతి లోక్ సభ ఉపఎన్నిక వేళ.... రైల్వే స్టేషన్ అభివృద్ధే తమ బాధ్యత అంటూ అభ్యర్థులు ప్రచారాలు నిర్వహిస్తూ ఓట్లు రాబట్లే ప్రయత్నాలు చేస్తున్నారు.

తిరుపతి ఉపఎన్నిక : రైల్వే స్టేషన్ అభివృద్దిపై అభ్యర్థుల ప్రచారాస్త్రాలు
తిరుపతి ఉపఎన్నిక : రైల్వే స్టేషన్ అభివృద్దిపై అభ్యర్థుల ప్రచారాస్త్రాలు

అత్యంత ప్రాముఖ్యత కలిగిన రైల్వే స్టేషన్లో ఒకటిగా.. ఏ1 గ్రేడ్ జాబితాలో స్వచ్ఛ స్టేషన్‌గా జాతీయ స్థాయిలో తిరుపతి రైల్వే స్టేషన్‌ మూడో స్థానాన్ని దక్కించుకుంది. కానీ ఈ స్టేషన్‌ పూర్తి స్థాయిలో అభివృద్ధికి మాత్రం నోచుకోవడం లేదనేది లోక్ సభ ఉపఎన్నికల వేళ ప్రచారాస్త్రంగా మారుతోంది. స్మార్ట్ రైల్వే స్టేషన్‌లో భాగంగా 450 కోట్ల రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనులు అంతంత మాత్రంగానే సాగుతున్నాయని అభ్యర్థులు హోరెత్తిస్తున్నారు. స్టేషన్‌లోని దక్షిణ, ఉత్తర ప్రవేశాలను ఆధునికీకరణ, చెన్నై ఎగ్మోర్ తరహాలో భూగర్భ రైల్వే లైన్ల ఏర్పాటు, ప్రస్తుతం నిర్మాణ తుదిదశలో ఉన్న ఆరో ప్లాట్ ఫాం తరహాలో మరిన్ని ప్లాట్ ఫాంలను అందుబాటులోకి తీసుకురావటం ఇలా రైల్వే స్టేషన్ లో ఏర్పాటు కాని సదుపాయాలను పార్లమెంట్ లో తమ వాణి వినిపించటం ద్వారా సాధిస్తామని నాయకులు హామీలు గుప్పిస్తున్నారు.

ప్లాట్ ఫాంల సంఖ్య సరిపడక..

తిరుపతిలో ఏటికేడు తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య పెరిగిపోతున్నా.. అందుకు తగినట్లుగా ప్లాట్ ఫాంల సంఖ్య లేకపోవటంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సకాలంలో రైళ్లు చేరుకున్నా.... తిరుపతిలో నిలిపేందుకు ఖాళీ లేకపోవటంతో... గంటల తరబడి రేణిగుంట జంక్షన్‌లో నిలిపివేస్తున్నారు. తిరుపతి రైల్వేస్టేషన్‌పై రైళ్ల రాకపోకల ఒత్తిడి తగ్గించే లక్ష్యంతో దక్షిణం వైపు చేపట్టిన ఆరో నెంబర్‌ ప్లాట్‌ఫారం పనులు తుదిదశకు చేరుకున్నాయి.

తాము అధికారంలోకి వస్తే..

కాస్తలో కాస్త మెరుగుగా తిరుచానూరు టర్మినల్‌ అభివృద్ధి పనులు జరుగుతున్నా అవి ఎప్పటికి పూర్తవుతాయనే విషయంలో స్పష్టత లేదు. తాము అధికారంలోకి వస్తే.... పార్లమెంట్ పరిధిలో స్టేషన్ అభివృద్ధికి కావాల్సిన నిధులను మంజూరు చేయించటంతో పాటు.... రైల్వే ప్రాంగణాన్ని స్మార్ట్ ప్రాజెక్ట్ గా మారుస్తామని హామీలు ఇస్తున్నారు.

భూ సమీకరణకు రాష్ట్ర ప్రభుత్వం సహకారం అవసరం

తిరుపతి రైల్వేస్టేషన్‌లో రద్దీని బదిలీ చేయాలనుకుంటున్న పశ్చిమ రైల్వేస్టేషన్ లో..... కొంత మేర భూ సమీకరణకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహకారం లభించాలని అధికారులు చెబుతున్నారు.

ఆ బాధ్యత కేంద్రానిది..

అయితే తిరుపతి రైల్వే స్టేషన్ స్మార్ట్ స్టేషన్ గా మార్చే బాధ్యతను కేంద్రప్రభుత్వం తీసుకుందని భాజపా నాయకులు చెబుతున్నారు. భాజపా ఎంపీ అభ్యర్థి విజయం సాధిస్తే మరిన్ని నిధులను స్మార్ట్ రైల్వే ప్రాజెక్ట్‌కి తీసుకురావటం ద్వారా అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో రైల్వే స్టేషన్ ను తీర్చిదిద్దేందుకు ఆస్కారం కలుగుతుందని ప్రచారం చేస్తున్నారు.

త్వరితగతిన పూర్తి చేయాలి..

మరో వైపు ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్న రాయల చెరువు రైల్వే గేటు, చంద్రగిరి సహా 12 రైల్వే క్రాసింగ్ గేట్ల పనులను త్వరితగతిన పూర్తి చేసి.. రైల్వే సమస్యలను పరిష్కరించాలని ఉపఎన్నికల వేళ నగర వాసులు కోరుతున్నారు.

ఇదీ చదవండి : సీఎం జగన్ తిరుపతి ఉప ఎన్నిక ప్రచార సభ రద్దు

కరోనా వేళ వైకాపా ప్రభుత్వం మిమ్మల్ని ఆదుకుందా?: చంద్రబాబు

అత్యంత ప్రాముఖ్యత కలిగిన రైల్వే స్టేషన్లో ఒకటిగా.. ఏ1 గ్రేడ్ జాబితాలో స్వచ్ఛ స్టేషన్‌గా జాతీయ స్థాయిలో తిరుపతి రైల్వే స్టేషన్‌ మూడో స్థానాన్ని దక్కించుకుంది. కానీ ఈ స్టేషన్‌ పూర్తి స్థాయిలో అభివృద్ధికి మాత్రం నోచుకోవడం లేదనేది లోక్ సభ ఉపఎన్నికల వేళ ప్రచారాస్త్రంగా మారుతోంది. స్మార్ట్ రైల్వే స్టేషన్‌లో భాగంగా 450 కోట్ల రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనులు అంతంత మాత్రంగానే సాగుతున్నాయని అభ్యర్థులు హోరెత్తిస్తున్నారు. స్టేషన్‌లోని దక్షిణ, ఉత్తర ప్రవేశాలను ఆధునికీకరణ, చెన్నై ఎగ్మోర్ తరహాలో భూగర్భ రైల్వే లైన్ల ఏర్పాటు, ప్రస్తుతం నిర్మాణ తుదిదశలో ఉన్న ఆరో ప్లాట్ ఫాం తరహాలో మరిన్ని ప్లాట్ ఫాంలను అందుబాటులోకి తీసుకురావటం ఇలా రైల్వే స్టేషన్ లో ఏర్పాటు కాని సదుపాయాలను పార్లమెంట్ లో తమ వాణి వినిపించటం ద్వారా సాధిస్తామని నాయకులు హామీలు గుప్పిస్తున్నారు.

ప్లాట్ ఫాంల సంఖ్య సరిపడక..

తిరుపతిలో ఏటికేడు తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య పెరిగిపోతున్నా.. అందుకు తగినట్లుగా ప్లాట్ ఫాంల సంఖ్య లేకపోవటంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సకాలంలో రైళ్లు చేరుకున్నా.... తిరుపతిలో నిలిపేందుకు ఖాళీ లేకపోవటంతో... గంటల తరబడి రేణిగుంట జంక్షన్‌లో నిలిపివేస్తున్నారు. తిరుపతి రైల్వేస్టేషన్‌పై రైళ్ల రాకపోకల ఒత్తిడి తగ్గించే లక్ష్యంతో దక్షిణం వైపు చేపట్టిన ఆరో నెంబర్‌ ప్లాట్‌ఫారం పనులు తుదిదశకు చేరుకున్నాయి.

తాము అధికారంలోకి వస్తే..

కాస్తలో కాస్త మెరుగుగా తిరుచానూరు టర్మినల్‌ అభివృద్ధి పనులు జరుగుతున్నా అవి ఎప్పటికి పూర్తవుతాయనే విషయంలో స్పష్టత లేదు. తాము అధికారంలోకి వస్తే.... పార్లమెంట్ పరిధిలో స్టేషన్ అభివృద్ధికి కావాల్సిన నిధులను మంజూరు చేయించటంతో పాటు.... రైల్వే ప్రాంగణాన్ని స్మార్ట్ ప్రాజెక్ట్ గా మారుస్తామని హామీలు ఇస్తున్నారు.

భూ సమీకరణకు రాష్ట్ర ప్రభుత్వం సహకారం అవసరం

తిరుపతి రైల్వేస్టేషన్‌లో రద్దీని బదిలీ చేయాలనుకుంటున్న పశ్చిమ రైల్వేస్టేషన్ లో..... కొంత మేర భూ సమీకరణకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహకారం లభించాలని అధికారులు చెబుతున్నారు.

ఆ బాధ్యత కేంద్రానిది..

అయితే తిరుపతి రైల్వే స్టేషన్ స్మార్ట్ స్టేషన్ గా మార్చే బాధ్యతను కేంద్రప్రభుత్వం తీసుకుందని భాజపా నాయకులు చెబుతున్నారు. భాజపా ఎంపీ అభ్యర్థి విజయం సాధిస్తే మరిన్ని నిధులను స్మార్ట్ రైల్వే ప్రాజెక్ట్‌కి తీసుకురావటం ద్వారా అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో రైల్వే స్టేషన్ ను తీర్చిదిద్దేందుకు ఆస్కారం కలుగుతుందని ప్రచారం చేస్తున్నారు.

త్వరితగతిన పూర్తి చేయాలి..

మరో వైపు ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్న రాయల చెరువు రైల్వే గేటు, చంద్రగిరి సహా 12 రైల్వే క్రాసింగ్ గేట్ల పనులను త్వరితగతిన పూర్తి చేసి.. రైల్వే సమస్యలను పరిష్కరించాలని ఉపఎన్నికల వేళ నగర వాసులు కోరుతున్నారు.

ఇదీ చదవండి : సీఎం జగన్ తిరుపతి ఉప ఎన్నిక ప్రచార సభ రద్దు

కరోనా వేళ వైకాపా ప్రభుత్వం మిమ్మల్ని ఆదుకుందా?: చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.