ETV Bharat / state

'కరోనా కట్టడికి సహకరించండి'

author img

By

Published : May 9, 2020, 2:28 PM IST

చెన్నై కోయంబేడు మార్కెట్‌ కరోనాకు హాట్‌స్పాట్‌గా మారిన నేపథ్యంలో... పొరుగునే ఉన్న చిత్తూరు జిల్లాపై ఆ ప్రభావం పడింది. ప్రజలంతా లాక్​డౌన్​ నిబంధనలు పాటించి కరోనా కట్టడికి సహకరించాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ పీఎస్ గిరీషా కోరారు.

తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ పీఎస్ గిరీషా ప్రెస్​మీట్​
తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ పీఎస్ గిరీషా ప్రెస్​మీట్​

చెన్నైలోని కోయంబేడు మార్కెట్ కారణంగా.... చిత్తూరు జిల్లాలో పాజిటివ్ కేసులు నమోదవుతున్న తరుణంలో ప్రజలంతా లాక్​డౌన్​ నిబంధనలను పాటించాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ పీఎస్ గిరీషా కోరారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో ఆయన అధికారులతో సమావేశం నిర్వహించారు.

ప్రస్తుతానికి తిరుపతిలో కోయంబేడు మార్కెట్​ కేసుల ప్రభావం లేదన్నారు. స్విమ్స్​లో కొవిడ్ కేసుల్లో వైద్యసహాయం అందిస్తున్న సిబ్బంది ఒకరు కరోనా బారిన పడినట్లు తెలిపారు. ప్రజలంతా బాధ్యతాయుతంగా ఉంటూ వైరస్ వ్యాప్తి నివారణకు కృషి చేయాలని కోరారు.

చెన్నైలోని కోయంబేడు మార్కెట్ కారణంగా.... చిత్తూరు జిల్లాలో పాజిటివ్ కేసులు నమోదవుతున్న తరుణంలో ప్రజలంతా లాక్​డౌన్​ నిబంధనలను పాటించాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ పీఎస్ గిరీషా కోరారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో ఆయన అధికారులతో సమావేశం నిర్వహించారు.

ప్రస్తుతానికి తిరుపతిలో కోయంబేడు మార్కెట్​ కేసుల ప్రభావం లేదన్నారు. స్విమ్స్​లో కొవిడ్ కేసుల్లో వైద్యసహాయం అందిస్తున్న సిబ్బంది ఒకరు కరోనా బారిన పడినట్లు తెలిపారు. ప్రజలంతా బాధ్యతాయుతంగా ఉంటూ వైరస్ వ్యాప్తి నివారణకు కృషి చేయాలని కోరారు.

ఇదీ చూడండి:

చిత్తూరులో కోయంబేడు కల్లోలం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.