ETV Bharat / state

తిరుమలలో వైభవంగా కైశిక ద్వాదశి ఆస్థానం - thirumala latest news

తిరుమలలో కైశిక ద్వాదశి ఆస్థానంను తితిదే వైభవంగా నిర్వహించింది. శ్రీవారి ఆలయంలో స్నపనబేరంగా పిలువబడే ఉగ్రశ్రీనివాసమూర్తి సమేత శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను తిరుచ్చి ఉత్సవంను ఆలయంలో ఏకాంతంగా నిర్వహించారు.

Sri Venkateswara Swamy
తిరుమలలో వైభవంగా కైశికద్వాదశి ఆస్థానం
author img

By

Published : Nov 27, 2020, 11:47 AM IST

తిరుమలలో వైభవంగా కైశికద్వాదశి ఆస్థానం

తిరుమలలో శ్రీవేంకటేశ్వర స్వామి వారికి కైశిక ద్వాదశి ఆస్థానంను తితిదే వేడుకగా నిర్వహించింది. శ్రీవారి ఆలయంలో స్నపనబేరంగా పిలువబడే ఉగ్రశ్రీనివాసమూర్తి సమేత శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను తిరుచ్చి ఉత్సవంను ఆలయంలో ఏకాంతంగా నిర్వహించారు. అనంతరం బంగారు వాకిలిచెంత ఆస్థానంను అర్చకులు వేడుకగా నిర్వహించారు. కైశిక ద్వాదశి ఆస్థానాన్ని పురాణపారాయణం ద్వారా అర్చకులు శాస్త్రోక్తంగా చేపట్టారు. ఏడాదిలో కైశిక ద్వాదశి రోజు మాత్రమే సూర్యోదయానికి ముందు ఉగ్రశ్రీనివాసమూర్తికి ఊరేగింపు నిర్వహించడం ఆనవాయితీ... నివర్‌ తుపాను ప్రభావంతో ఆలయంలోనే ఏకాంతంగా వేకువజామున నాలుగున్నర నుంచి ఐదున్నర గంటల మద్య ఉత్సవాన్ని నిర్వహించారు.

ఇదీ చదవండీ...నివర్ ప్రభావం... పుష్కరాలు కళావిహీనం

తిరుమలలో వైభవంగా కైశికద్వాదశి ఆస్థానం

తిరుమలలో శ్రీవేంకటేశ్వర స్వామి వారికి కైశిక ద్వాదశి ఆస్థానంను తితిదే వేడుకగా నిర్వహించింది. శ్రీవారి ఆలయంలో స్నపనబేరంగా పిలువబడే ఉగ్రశ్రీనివాసమూర్తి సమేత శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను తిరుచ్చి ఉత్సవంను ఆలయంలో ఏకాంతంగా నిర్వహించారు. అనంతరం బంగారు వాకిలిచెంత ఆస్థానంను అర్చకులు వేడుకగా నిర్వహించారు. కైశిక ద్వాదశి ఆస్థానాన్ని పురాణపారాయణం ద్వారా అర్చకులు శాస్త్రోక్తంగా చేపట్టారు. ఏడాదిలో కైశిక ద్వాదశి రోజు మాత్రమే సూర్యోదయానికి ముందు ఉగ్రశ్రీనివాసమూర్తికి ఊరేగింపు నిర్వహించడం ఆనవాయితీ... నివర్‌ తుపాను ప్రభావంతో ఆలయంలోనే ఏకాంతంగా వేకువజామున నాలుగున్నర నుంచి ఐదున్నర గంటల మద్య ఉత్సవాన్ని నిర్వహించారు.

ఇదీ చదవండీ...నివర్ ప్రభావం... పుష్కరాలు కళావిహీనం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.