ETV Bharat / state

డీకేటీ భూముల వివాదం.. రైతులు, షికారీల మధ్య గొడవ - చిత్తూరులో డీకేటీ భూముల వివాదం

చిత్తూరు జిల్లాలోని ఏర్పేడు మండలంలో రైతులు, షికారీల మధ్య వాగ్వాదం జరిగింది. రైతులు సాగు చేయకుండా షికారీలు అడ్డుకున్నారు. ప్రభుత్వం తమకిచ్చిన భూములను రైతులు ఆక్రమించుకున్నారని షీకారీలు వాదిస్తున్నారు. ఈ భూములపై ఎన్నో ఏళ్లుగా రైతులు, షికారీల మధ్య గొడవ జరుగుతోంది.

The hunters stoped the farmers for cultivation at chittor
రైతులను అడ్డుకున్న షికారీలు
author img

By

Published : Sep 29, 2020, 4:10 PM IST

రైతులను అడ్డుకున్న షికారీలు

చిత్తూరు జిల్లాలోని ఏర్పేడు మండలం చితలపాళ్ళెంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తమ భూముల్లో సాగు చేయడానికి యత్నించిన రైతులను.. షికారీలు అడ్డుకున్నారు. తమ భూములను ఆక్రమించారని రైతులు ఆందోళనకు దిగారు. తమ సంతకాలు ఫోర్జరీ చేసి భూములు విక్రయిస్తున్నారని ఆరోపించారు.

The hunters stoped the farmers for cultivation at chittor
రైతులను అడ్డుకున్న షికారీలు

దాదాపు 530 ఎకరాలకు సంబంధించి రైతులు, షికారీల మధ్య కొన్నేళ్లుగా వివాదం జరుగుతోంది. సర్వే నంబర్ 350 నుంచి 450 వరకు గల 530 ఎకరాలకు సంబంధించి గత కొన్నేళ్లుగా రైతులు, షికారీల గొడవ జరుగుతోంది. 1970 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం షికారీలకు డీకేటి పట్టాలు అందచేసింది. కొంతకాలం తర్వాత షికారీల నుంచి రైతులు భూములు కొనుగోలు చేశారు.

The hunters stoped the farmers for cultivation at chittor
రైతులను అడ్డుకున్న షికారీలు

నిబంధనల మేరకు డీకేటీ భూములు క్రయ విక్రయాలు చేయకూడదు. భూములు కొనుగోలు చేసిన రైతులు 1985 నుంచి సాగు చేస్తుండటంతో అనుభవ పట్టాలు పొందారు. తమ సంతకాలు ఫోర్జరీ చేసి తాము విక్రయించినట్లు.. తప్పడు పత్రాలు సృష్టించి రైతులు తమ భూములు ఆక్రమించారని షికారీలు ఆరోపిస్తూ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో ఇరువర్గాలు మధ్య వివాదం తారాస్థాయికి చేరింది.

The hunters stoped the farmers for cultivation at chittor
రైతులను అడ్డుకున్న షికారీలు

ఇటీవల షికారీలకు చెందిన ఓ యువకుడు హత్యకు గురయ్యారు. పరిస్థితి విషమించడంతో భూ వివాదంపై ప్రత్యేక అధికారిని నియమిస్తూ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. పలుమార్లు వివాద ప్రాంతాన్ని పరిశీలించారు. సమస్య పరిష్కారం కాకపోవటంతో రైతులు భూమి సాగు చేయటానికి ప్రయత్నించారు. షికారీలు అడ్డుకొంటున్నారు. రైతులు ఇవాళ భూమి సాగు చేయటానికి ప్రయత్నించటంతో మరోసారి షికారీలు అడ్డుకొన్నారు.

ఇదీ చదవండి: న్యాయమూర్తి రామకృష్ణ సోదరుడిపై దాడి: చంద్రబాబుకు డీజీపీ లేఖ

రైతులను అడ్డుకున్న షికారీలు

చిత్తూరు జిల్లాలోని ఏర్పేడు మండలం చితలపాళ్ళెంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తమ భూముల్లో సాగు చేయడానికి యత్నించిన రైతులను.. షికారీలు అడ్డుకున్నారు. తమ భూములను ఆక్రమించారని రైతులు ఆందోళనకు దిగారు. తమ సంతకాలు ఫోర్జరీ చేసి భూములు విక్రయిస్తున్నారని ఆరోపించారు.

The hunters stoped the farmers for cultivation at chittor
రైతులను అడ్డుకున్న షికారీలు

దాదాపు 530 ఎకరాలకు సంబంధించి రైతులు, షికారీల మధ్య కొన్నేళ్లుగా వివాదం జరుగుతోంది. సర్వే నంబర్ 350 నుంచి 450 వరకు గల 530 ఎకరాలకు సంబంధించి గత కొన్నేళ్లుగా రైతులు, షికారీల గొడవ జరుగుతోంది. 1970 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం షికారీలకు డీకేటి పట్టాలు అందచేసింది. కొంతకాలం తర్వాత షికారీల నుంచి రైతులు భూములు కొనుగోలు చేశారు.

The hunters stoped the farmers for cultivation at chittor
రైతులను అడ్డుకున్న షికారీలు

నిబంధనల మేరకు డీకేటీ భూములు క్రయ విక్రయాలు చేయకూడదు. భూములు కొనుగోలు చేసిన రైతులు 1985 నుంచి సాగు చేస్తుండటంతో అనుభవ పట్టాలు పొందారు. తమ సంతకాలు ఫోర్జరీ చేసి తాము విక్రయించినట్లు.. తప్పడు పత్రాలు సృష్టించి రైతులు తమ భూములు ఆక్రమించారని షికారీలు ఆరోపిస్తూ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో ఇరువర్గాలు మధ్య వివాదం తారాస్థాయికి చేరింది.

The hunters stoped the farmers for cultivation at chittor
రైతులను అడ్డుకున్న షికారీలు

ఇటీవల షికారీలకు చెందిన ఓ యువకుడు హత్యకు గురయ్యారు. పరిస్థితి విషమించడంతో భూ వివాదంపై ప్రత్యేక అధికారిని నియమిస్తూ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. పలుమార్లు వివాద ప్రాంతాన్ని పరిశీలించారు. సమస్య పరిష్కారం కాకపోవటంతో రైతులు భూమి సాగు చేయటానికి ప్రయత్నించారు. షికారీలు అడ్డుకొంటున్నారు. రైతులు ఇవాళ భూమి సాగు చేయటానికి ప్రయత్నించటంతో మరోసారి షికారీలు అడ్డుకొన్నారు.

ఇదీ చదవండి: న్యాయమూర్తి రామకృష్ణ సోదరుడిపై దాడి: చంద్రబాబుకు డీజీపీ లేఖ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.