నగరి నియోజకవర్గంలో తెదేపా జనచైతన్య యాత్ర ప్రారంభం...
By
Published : Feb 20, 2020, 4:00 PM IST
చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలోని వడమాలపేట మండలం కల్లూరు గ్రామ పంచాయతీలో నగరి తెదేపా బాధ్యుడు గాలి భానుప్రకాష్ ఆధ్వర్యంలో జన చైతన్య యాత్రను ప్రారంభించారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని భానుప్రకాష్ విమర్శించారు. అర్హులైన వారికి పింఛన్లు ఇవ్వడం లేదని ఆయన ఆరోపించారు. ప్రజల్లో ఈ విషయాలపై అవగాహన కల్పించేందుకు తెదేపా అధినేత చంద్రబాబు జన చైతన్య యాత్రను తలపెట్టారని అన్నారు.