ప్రభుత్వ అవగాహనారాహిత్యంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని మాజీ మంత్రి అమర్నాథ్రెడ్డి తిరుపతిలో విమర్శించారు. సరికొత్త విధానాలు అమలులోకి తీసుకువస్తామంటూ ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతున్నారని ఆరోపించారు. భవన నిర్మాణ కార్మికులు, ప్రజలు ఇసుక అందక తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని... ఈ అంశంలో ప్రజలకు తెలుగుదేశం మద్దతుగా నిలుస్తుందని తెలిపారు. రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో ఈ నెల 24న నుంచి వామపక్షాలతో కలిసి రిలే నిహారాదీక్షలకు దిగుతున్నట్లు ప్రకటించారు. వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నా... హంద్రీనీవా ద్వారా చిత్తూరు జిల్లా పడమటి మండలాలకు నీరు ఇవ్వకపోవటం దారుణమంటూ అమర్నాథ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వేల టీఎంసీలు వృథాగా సముద్రంలోకి పోతున్నా ప్రభుత్వానికి పట్టడం లేదని మండిపడ్డారు. వచ్చే నెల 7, 8 తేదీల్లో చిత్తూరు జిల్లాలో పర్యటించనున్న తెదేపా అధినేత చంద్రబాబు దృష్టికి ఈ సమస్యలు తీసుకెళ్లి పోరాటం తీవ్రతరం చేస్తామని వివరించారు.
"ఈ నెల 24 నుంచి రాష్ట్రవ్యాప్తంగా రిలే నిరాహార దీక్షలు"
ఇసుక కొరత వల్ల నష్టపోయిన కార్మికులకు మద్దతుగా ఈ నెల 24 నుంచి తెదేపా ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా రిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నట్లు మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి తెలిపారు.
ప్రభుత్వ అవగాహనారాహిత్యంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని మాజీ మంత్రి అమర్నాథ్రెడ్డి తిరుపతిలో విమర్శించారు. సరికొత్త విధానాలు అమలులోకి తీసుకువస్తామంటూ ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతున్నారని ఆరోపించారు. భవన నిర్మాణ కార్మికులు, ప్రజలు ఇసుక అందక తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని... ఈ అంశంలో ప్రజలకు తెలుగుదేశం మద్దతుగా నిలుస్తుందని తెలిపారు. రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో ఈ నెల 24న నుంచి వామపక్షాలతో కలిసి రిలే నిహారాదీక్షలకు దిగుతున్నట్లు ప్రకటించారు. వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నా... హంద్రీనీవా ద్వారా చిత్తూరు జిల్లా పడమటి మండలాలకు నీరు ఇవ్వకపోవటం దారుణమంటూ అమర్నాథ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వేల టీఎంసీలు వృథాగా సముద్రంలోకి పోతున్నా ప్రభుత్వానికి పట్టడం లేదని మండిపడ్డారు. వచ్చే నెల 7, 8 తేదీల్లో చిత్తూరు జిల్లాలో పర్యటించనున్న తెదేపా అధినేత చంద్రబాబు దృష్టికి ఈ సమస్యలు తీసుకెళ్లి పోరాటం తీవ్రతరం చేస్తామని వివరించారు.