జమ్మూకాశ్మీర్లో జరిగిన తీవ్రవాదుల ఎదురు కాల్పుల్లో వీరమరణం పొందిన... చిత్తూరు జిల్లాకు చెందిన జవాన్ ప్రవీణ్ కుమార్ రెడ్డి కుటుంబానికి ఎస్బీఐ...రూ. 30 లక్షల చెక్కును అందజేసింది. ఎస్బీఐలో ప్రవీణ్ సైనిక ఖాతా ద్వారా లావాదేవీలు నిర్వహిస్తుండటంతో... బ్యాంకు ఖాతా బీమా కింద రూ. 30 లక్షలు వచ్చినట్లు బ్యాంకు చీఫ్ మేనేజర్ రాధాకృష్ణ తెలిపారు. వీరమరణం పొందిన ప్రవీణ్ కుటుంబానికి స్టేట్బ్యాంక్ అండగా ఉంటుందన్నారు.
ఇదీ చదవండి: