తిరుమలలో గత రెండు రోజులుగా కురుస్తున్న వానతో జలాశయాల్లోకి భారీగా వరద నీరు చేరుతోంది. తిరుమల కొండపై ఉన్న ఐదు జలాశయాలు పూర్తిగా నిండిపోయాయి. కుమారధార, పసుపుధార జలాశయాలు పొంగి పొర్లుతున్నాయి. పాపవినాశనం జలాశయం గేట్లు బుధవారం సాయంత్రం నుంచి తెరిచి ఉంచారు. గోగర్భం జలాశయానికి అటవీ ప్రాంతం నుంచి భారీగా వరద చేరుతోంది. ఆకాశం గంగ జలాశయం కూడా పూర్తిగా నిండిపోయింది. జలాశయాల గేట్లు తెరవడం, కొండపై కురుస్తున్న వర్షంతో దిగువ ప్రాంతానికి భారీ వర్షం నీరు ప్రవహిస్తోంది. దీంతో తిరుపతిలో అధికారులు అప్రమత్తమయ్యారు.
తిరుమలలో భారీ వర్షం .. నిండిన జలాశయాలు
నివర్ ప్రభావంతో తిరుమలలో భారీ వర్షం కురుస్తోంది. ఈ వర్షం కారణంగా కొండపై ఉన్న జలాశయాలన్నీ నిండిపోయాయి. అధికారులు ప్రాజెక్టుల గేట్లేత్తి నీటిని కిందికి వదులుతున్నారు.
![తిరుమలలో భారీ వర్షం .. నిండిన జలాశయాలు reservoirs filled in tirumala](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9670437-317-9670437-1606391555591.jpg?imwidth=3840)
తిరుమలలో గత రెండు రోజులుగా కురుస్తున్న వానతో జలాశయాల్లోకి భారీగా వరద నీరు చేరుతోంది. తిరుమల కొండపై ఉన్న ఐదు జలాశయాలు పూర్తిగా నిండిపోయాయి. కుమారధార, పసుపుధార జలాశయాలు పొంగి పొర్లుతున్నాయి. పాపవినాశనం జలాశయం గేట్లు బుధవారం సాయంత్రం నుంచి తెరిచి ఉంచారు. గోగర్భం జలాశయానికి అటవీ ప్రాంతం నుంచి భారీగా వరద చేరుతోంది. ఆకాశం గంగ జలాశయం కూడా పూర్తిగా నిండిపోయింది. జలాశయాల గేట్లు తెరవడం, కొండపై కురుస్తున్న వర్షంతో దిగువ ప్రాంతానికి భారీ వర్షం నీరు ప్రవహిస్తోంది. దీంతో తిరుపతిలో అధికారులు అప్రమత్తమయ్యారు.
ఇదీ చూడండి.
'అమ్మ స్ఫూర్తితో ఉద్యోగం సాధించా.. నేరాలను వేగంగా దర్యాప్తు చేస్తా'