ETV Bharat / state

అర్ధరాత్రి కూంబింగ్‌... కనిపించింది 35 మంది... దొరికింది ఒక్కడు - lates red sand smuggler arrest news at a rangampeta

అక్రమంగా తరలిస్తున్న ఎర్ర చందనం దుంగలను టాస్కఫోర్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఓ నిందితుడుని అరెస్టు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

red sandle smuggler arrest
ఎర్రచందనం దుంగలు స్వాధీనం
author img

By

Published : Jan 6, 2020, 11:11 AM IST

ఎర్రచందనం దుంగలు స్వాధీనం
శేషాచలం అడవుల్లో దొరికే ఎర్రచందనం స్మగ్లింగ్ జరగకుండా ఆపేందుకు నిరంతర కూంబింగ్​లు నిర్వహిస్తున్నా స్మగ్లర్​లు ఏమాత్రం భయపడటం లేదు. తిరుపతికి చెందిన వ్యక్తి సాయంతో 29 ఎర్రచందనం దుంగలను రవాణా చేయటానికి ప్రయత్నిస్తున్న వ్యక్తిని టాస్క్​ఫోర్స్ అధికారులు అరెస్టు చేశారు. కళ్యాణి డ్యామ్ నుంచి బాకరాపేట ఘాట్ వైపు టాస్క్​ఫోర్స్ అధికారులు కూంబింగ్ చేపట్టారు. ఈ క్రమంలోనే ఏ.రంగంపేట, ఆవుల దొడ్డి వద్ద అనుమానాస్పదంగా ఉన్న కారును అధికారులు గుర్తించారు. అదే సమయంలో సుమారు 35 మంది స్మగ్లర్లు దుంగలను మోసుకొస్తుండగా, టాస్క్​ఫోర్స్ వారిని చూడగానే దుంగలను పడేసి పరారయ్యారు. దట్టమైన పొదలు, చిమ్మచీకటి వారు పారిపోవటానికి అనుకూలంగా మారింది. కారు వద్ద ఉన్న సయ్యద్ జమీల్​ను అరెస్టు చేసి, 29 దుంగలను స్వాధీనం చేసుకున్నారు.

ఇదీ చదవండి: ఎంపీడీవోపై దాడి... చర్చనీయాంశమైన వైకాపా నేత తీరు..!

ఎర్రచందనం దుంగలు స్వాధీనం
శేషాచలం అడవుల్లో దొరికే ఎర్రచందనం స్మగ్లింగ్ జరగకుండా ఆపేందుకు నిరంతర కూంబింగ్​లు నిర్వహిస్తున్నా స్మగ్లర్​లు ఏమాత్రం భయపడటం లేదు. తిరుపతికి చెందిన వ్యక్తి సాయంతో 29 ఎర్రచందనం దుంగలను రవాణా చేయటానికి ప్రయత్నిస్తున్న వ్యక్తిని టాస్క్​ఫోర్స్ అధికారులు అరెస్టు చేశారు. కళ్యాణి డ్యామ్ నుంచి బాకరాపేట ఘాట్ వైపు టాస్క్​ఫోర్స్ అధికారులు కూంబింగ్ చేపట్టారు. ఈ క్రమంలోనే ఏ.రంగంపేట, ఆవుల దొడ్డి వద్ద అనుమానాస్పదంగా ఉన్న కారును అధికారులు గుర్తించారు. అదే సమయంలో సుమారు 35 మంది స్మగ్లర్లు దుంగలను మోసుకొస్తుండగా, టాస్క్​ఫోర్స్ వారిని చూడగానే దుంగలను పడేసి పరారయ్యారు. దట్టమైన పొదలు, చిమ్మచీకటి వారు పారిపోవటానికి అనుకూలంగా మారింది. కారు వద్ద ఉన్న సయ్యద్ జమీల్​ను అరెస్టు చేసి, 29 దుంగలను స్వాధీనం చేసుకున్నారు.

ఇదీ చదవండి: ఎంపీడీవోపై దాడి... చర్చనీయాంశమైన వైకాపా నేత తీరు..!

Intro:తమిళ స్మగ్లర్లు కు సహాయం చేసిన
స్థానికుడు అరెస్టు.పారిపోయిన తమిళ స్మగ్లర్లు.
29 ఎర్ర చందనం దుంగలు,కారు స్వాధీనం.Body:Ap_tpt_36b_05_errachandanam_swadhinam_av_ap10100

శేషాచల అడవులలో కొనసాగుతున్న టాస్క్ ఫోర్స్ కుంబింగ్.ఏ.రంగంపేట అటవీప్రాంతంలో
తిరుపతి కి చెందిన వ్యక్తి సహాయంతో 29 ఎర్ర చందనం దుంగలను రవాణా చేయడానికి సిద్దంగా ఉన్న వాహనాన్ని టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దాదాపు 35 మంది తమిళ స్మగ్లర్లు ఎర్ర చందనం దుంగలను మోసుకుని టాస్క్ ఫోర్స్ అధికారులకు తారసపడ్డారు. శనివారం రాత్రి నుంచి కల్యాణి డ్యామ్ నుంచి బాకరాపేట ఘాట్ వైపు కూంబింగ్ చేపట్టారు. ఆదివారం ఉదయం ఆవుల దొడ్డి ప్రాంతంలో ఒక కారు అనుమానాస్పదంగా కనిపించింది. అదే సమయానికి దాదాపు 35 మంది స్మగ్లర్లు దుంగలను మోసుకుని వస్తూ కనిపించారు.‌ వాహనం వద్ద తిరుపతి గిరిపురం కాలనీకి చెందిన సయ్యద్ జమీల్ (21) కాపలా ఉన్నాడు. టాస్క్ ఫోర్స్ సిబ్బంది ని చూసిన తమిళ స్మగ్లర్లు దుంగలను పడేసి పారిపోయారు. దట్టమైన పొదలు చిమ్మ చీకటి వాళ్లు పారిపోవడానికి అనుకూలమయ్యింది. సయ్యద్ జమీల్ ను అరెస్టు చేసి, చెల్లా చెదురుగా ఉన్న 29 దుంగలను స్వాధీనం చేసుకున్నారు. సంఘటన స్థలానికి సిఐ సుబ్రమణ్యం, పీసీ నాగేంద్ర చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు.Conclusion:పి.రవికిషోర్,చంద్రగిరి.9985555813.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.