హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించే క్రమంలో అదుపుతప్పి.. బోల్తాపడింది. ఈ ఘటన చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం మేర్లపాక వద్ద జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రయాణికులు స్వల్పంగా గాయపడగా, మిగిలిన వారు క్షేమంగా బయటపడ్డారు. క్షతగాత్రులను 108 వాహనంలో శ్రీకాళహస్తిలోని ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఏర్పేడు పోలీసులు, ప్రమాదం గురించి విచారణ చేపట్టారు.
ఇదీ చదవండి: