ఆధార్లో మార్పులు చేర్పులు కోసం ప్రజలకు తిప్పలు తప్పడంలేదు. వందల మంది గ్రామీణ ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల ఎదుట బారులుతీరుతున్నారు. అయితే వీరి సమస్య పరిష్కరించాల్సిన అధికారులు మాత్రం మిన్నకుండి పోతున్నారు. వందల మంది ప్రజలు కార్యాలయాలకు వస్తే 20లేదా 30 మందికి మాత్రమే ఆధార్ మార్పులు చేస్తున్నారు. కొంతమంది పది రోజులుగా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా పనికావటం లేదని వాపోతున్నారు. చిత్తూరు జిల్లా మదనపల్లెలోని బిఎస్ఎన్ఎల్ కార్యాలయం ఎదుట వందల మంది ప్రజలు బారులు తీరగా.. 20 నుంచి 50 మందికి మాత్రమే పని జరుగుతుంది. దీంతో ఈ సమస్యకు పరిష్కారం ప్రభుత్వమే చేయాలని కోరుతున్నారు.
ఇదీచూడండి:కంగారు పడకండి..ఇవి సాధారణ తనిఖీలే..: తిరుపతి ఎస్పీ