ETV Bharat / state

ఆక్సిజన్​ వార్​ రూం ఏర్పాటు.. జిల్లా అధికారుల నిర్ణయం

author img

By

Published : May 11, 2021, 8:05 PM IST

రుయా ఘటన నేపథ్యంలో చిత్తూరు జిల్లా ఉన్నతాధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ప్రత్యేక ఆక్సిజన్​ వార్​ రూం ఏర్పాటు చేసేందుకు చిత్తూరు జిల్లా అధికారులు రూపకల్పన చేశారు. విపత్తు నిర్వహణ చట్టం కింద అలసత్వం వహించేవారిపై చర్యలు తీసుకుంటామని వారు అంటున్నారు.

oxygen war room in chittoor district
ఆక్సిజన్​ వార్​ రూం ఏర్పాటుకు చిత్తూరు జిల్లా అధికారుల నిర్ణయం

రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర విషాదం నింపిన తిరుపతి రుయా సంఘటనతో అప్రమత్తమైన చిత్తూరు జిల్లా ఉన్నతాధికారులు.. ఆక్సిజన్ వార్ రూం ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. తిరుపతి ఆర్డీవో కార్యాలయంలో జేసీ (ఆరోగ్యం), ఆర్డీవో ఇతర ఉన్నతాధికారులు సమావేశమై చర్చించారు.

ప్రభుత్వ, ప్రైవేటు కోవిడ్ ఆస్పత్రుల్లో ఆక్సిజన్ సరఫరా, అవసరాలు, వాడకం పర్యవేక్షణపై ప్రత్యేక అధికారులను నియమించాలనే నిర్ణయానికి వచ్చారు. రోగికి ఆక్సిజన్ అందలేదని ఫిర్యాదులు వస్తే విపత్తు నిర్వహణ చట్టం కింద సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని జేసీ వీరబ్రహ్మం హెచ్చరించారు.

ఇవీ చదవండి:

రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర విషాదం నింపిన తిరుపతి రుయా సంఘటనతో అప్రమత్తమైన చిత్తూరు జిల్లా ఉన్నతాధికారులు.. ఆక్సిజన్ వార్ రూం ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. తిరుపతి ఆర్డీవో కార్యాలయంలో జేసీ (ఆరోగ్యం), ఆర్డీవో ఇతర ఉన్నతాధికారులు సమావేశమై చర్చించారు.

ప్రభుత్వ, ప్రైవేటు కోవిడ్ ఆస్పత్రుల్లో ఆక్సిజన్ సరఫరా, అవసరాలు, వాడకం పర్యవేక్షణపై ప్రత్యేక అధికారులను నియమించాలనే నిర్ణయానికి వచ్చారు. రోగికి ఆక్సిజన్ అందలేదని ఫిర్యాదులు వస్తే విపత్తు నిర్వహణ చట్టం కింద సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని జేసీ వీరబ్రహ్మం హెచ్చరించారు.

ఇవీ చదవండి:

కొవిడ్​ కేర్ సెంటర్​గా గోశాల

రుయా ఆసుపత్రి విషాదాన్ని రాజకీయం చేయడం తగదు: ఎమ్మెల్యే భూమన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.