చిత్తూరు జిల్లా నారాయణవనం మండలం కైలాసకోన ప్రాంతం కర్ఫ్యూ కారణంగా మూతపడింది. పర్యాటకులు లేకపోవటంతో..మూగజీవాలు ఆకలితో అల్లాడిపోతున్నాయి. దీంతో వాటి ఆకలి తీర్చేందుకు ముందుకువచ్చిన కైలాసనాథ ఆలయ కమిటీ.. కోతులకు ఆహారాన్ని అందించేలా ఏర్పాట్లు చేసింది. అయితే వానర మూకలకు గుంపుగా దూసుకువచ్చే లక్షణం ఉండటంతో..ఆలయ కమిటీ అచ్చం మనుషులకు గీసినట్లే సర్కిళ్లు గీసి ఆహారాన్ని అందిస్తోంది.
ఆశ్చర్యకరంగా కోతులు సైతం సరిగ్గా అదే గిరిలో కూర్చుని చాలా క్రమశిక్షణతో ఆహారాన్ని తీసుకుంటున్నాయి. వానరాలే అంత క్రమశిక్షణను పాటిస్తున్న వేళ..విచక్షణ జ్ఞానం కలిగిన మనుషులు ప్రస్తుత పరిస్థితులను అర్థం చేసుకుని భౌతిక దూరం పాటించటం, మాస్క్ను తప్పనిసరిగా వాడటం వంటి కరోనా నిబంధనలను పాటించాలని పలువురు కోరుతున్నారు.
ఇదీ చదవండి