ETV Bharat / state

తండ్రి హత్య కేసులో తనయుడి అరెస్టు

చిత్తూరు జిల్లాలో తండ్రిని హత్య చేసిన కేసులో నిందితుడైన తనయుడు సునీల్‌ అలియాస్‌ పండును మంగళవారం పోలీసులు

author img

By

Published : Jun 17, 2020, 6:39 PM IST

Man arrested for murder of father at chirttor
తండ్రి హత్య కేసులో తనయుడి అరెస్టు

చిత్తూరు జిల్లాలో తండ్రిని హత్య చేసిన కేసులో నిందితుడైన తనయుడు సునీల్‌ అలియాస్‌ పండును మంగళవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు గంగవరం సీఐ రామకృష్ణాచారి తెలిపారు. ఈ నెల 14న బాపలనత్తం గ్రామానికి చెందిన చిన్నబ్బ, అతడి కుమారుడు సునీల్‌ మద్యం మత్తులో ఇంటి స్థలం విషయమై ఘర్షణ పడ్డారు. తండ్రిని తనయుడు కర్రతో బలంగా కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.

ఈ ఘటనలో గాయపడిన సునీల్‌ పలమనేరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స తీసుకుని మంగళవారం డిశ్ఛార్జి కాగా అతన్ని అరెస్టు చేసినట్లు చెప్పారు. నిందితుడు హత్యకు ఉపయోగించిన కర్రను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించినట్లు వివరించారు. ఎస్సై మునిస్వామి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

చిత్తూరు జిల్లాలో తండ్రిని హత్య చేసిన కేసులో నిందితుడైన తనయుడు సునీల్‌ అలియాస్‌ పండును మంగళవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు గంగవరం సీఐ రామకృష్ణాచారి తెలిపారు. ఈ నెల 14న బాపలనత్తం గ్రామానికి చెందిన చిన్నబ్బ, అతడి కుమారుడు సునీల్‌ మద్యం మత్తులో ఇంటి స్థలం విషయమై ఘర్షణ పడ్డారు. తండ్రిని తనయుడు కర్రతో బలంగా కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.

ఈ ఘటనలో గాయపడిన సునీల్‌ పలమనేరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స తీసుకుని మంగళవారం డిశ్ఛార్జి కాగా అతన్ని అరెస్టు చేసినట్లు చెప్పారు. నిందితుడు హత్యకు ఉపయోగించిన కర్రను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించినట్లు వివరించారు. ఎస్సై మునిస్వామి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

ఇవీ చూడండి:జోరందుకున్న ఆటోమొబైల్ అమ్మకాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.