కర్ణాటక రాష్ట్రం నుంచి కాంట్రాక్టర్లు ఒకేసారి మన రాష్ట్రానికి చెందిన వెయ్యి మందికి పైగా వలస కూలీలను తీసుకొచ్చి చిత్తూరు జిల్లా గంగవరం ప్రాంతంలోని సరిహద్దులో వదిలి వెళ్లారు. వీరంతా రాష్ట్రంలోని పలు జిల్లాలకు చెందినవారు. విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ భరత్ నారాయణ, ఇతర అధికారులు అక్కడికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. కోలార్ కలెక్టర్తో మాట్లాడిన ఏపీ అధికారులు వలస కూలీలను కర్ణాటక ప్రాంతంలోనే వసతి కల్పించాలని కోరారు.
ఇవీ చదవండి: ఈ పాపం ఎవరిది..? కొడుకు మృతదేహాన్ని శ్మశానానికి మోసుకెళ్లిన తండ్రి