ఎన్పీఆర్, ఎన్ఆర్సీ, సీఏఏ కు నిరసనగా.. చిత్తూరు జిల్లా కలికిరిలో ముస్లింలు రిలే దీక్ష చేశారు. వెంటనే ఉపసంహరించుకోవాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. అన్ని వర్గాల ప్రజల స్వేచ్ఛ, సమానత్వానికి తూట్లు పొడిచేలా ఈ ప్రతిపాదనలు ఉన్నాయని అన్నారు. హక్కుల సాధన కోసం రాజీలేని పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.